PM Narendra Modi AP Tour : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(బుధవారం) ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ది పనులు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు... మరికొన్నింటిని ప్రారంభించనున్నారు. ఉత్తరాంద్ర గడ్డపైనుండి ఏకంగా రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇలా ఏపీ భవిష్యత్ ను అభివృద్ది దిశగా నడిపించడంలో ప్రధాని పర్యటన కీలకంగా మారింది.
ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని మోదీ విశాఖపట్నం చేరుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి విశాఖలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ వేదిక పైనుండే వివిధ అభివృద్ది, సంక్షేమ పనులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ.
ప్రధాని ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది కోసం ప్రారంభించే ప్రాజెక్టులు, అభివృద్ది పనులతో ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. మరీముఖ్యంగా యువతకు భారీగా ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. అంతేకాదు సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపించనున్నాయి. ఇక శంకుస్థాపన చేసే పనులు పూర్తయితే ఏపీ అభివృద్దికి కేరాఫ్ అడ్రస్ గా మారనుంది.