మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. తమ బాధలు చెప్పుకునేందుకు చాలామంది జనసేన కార్యాలయానికి తరలివచ్చారు. ఇలా ఓ బాధితుడు ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో నలిగిపోయి కాపాడాలంటూ జనసేన ఎమ్మెల్యేను ఆశ్రయించాడు.
గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేయించానని... దీంతో తనపై కక్ష అతడు పెంచుకున్నాడని బాధితుడు జనసేన ఎమ్మెల్యేకు తెలిపాడు. ఈ క్రమంలోనే తన భూమికి దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేసాడని... ఇదేంటని అడిగితే దౌర్జన్యం చేస్తున్నాడని వాపోయాడు. పోలీసులు, అధికారులను ఆశ్రయించినా లాభం లేకుండా పోయిందని... ఎక్కడా తనకు న్యాయం జరగడంలేదని తెలిపారు. దయచేసి ఎర్రచందనం స్మగ్లర్ బారినుండి తన భూమిని కాపాడాలంటూ బాధితుడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ను కోరాడు. అతడి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.