Pawan kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఆప‌రేష‌న్‌.. అస‌లేం జ‌రిగింది.? ఎప్పుడెలా ఉన్నారు.?

Published : Apr 19, 2026, 12:23 PM IST

Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన, వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. 

PREV
15
అస్వస్థతతో ఆస్పత్రికి తరలింపు

ఏప్రిల్ 17న అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు ఒక్కసారిగా అస్వస్థత కలిగింది. పరిస్థితిని గమనించిన వెంటనే అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని, హైదరాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు.

పరీక్షల తర్వాత శస్త్రచికిత్స నిర్ణయం

ఆస్పత్రిలో చేసిన MRI సహా వివిధ పరీక్షల రిపోర్టులను పరిశీలించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స అవసరం అని తేల్చారు. కొంతకాలంగా కొనసాగుతున్న సైనసైటిస్ సమస్య కారణంగా ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండటంతో ముక్కుకు సంబంధించిన శస్త్రచికిత్స చేయాలని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అనంతరం శనివారం సాయంత్రం ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.

25
నిల‌క‌డ‌గా ఆరోగ్యం

శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కనీసం ఒక వారం నుంచి పది రోజుల వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అలాగే కొంతకాలం పాటు ఒత్తిడి తగ్గించుకోవడం, ఆహార నియమాలు పాటించడం అవసరం అని పేర్కొన్నారు. పూర్తి కోలుకున్న తర్వాత ఆయన తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

35
నేతలు, కుటుంబ సభ్యుల పరామర్శలు

ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. భార్య అన్నా లెజినోవా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వెల్లడించగా, సాయి ధ‌ర‌మ్ తేజ్‌ కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

45
ప్రధాని మోదీ ఫోన్ కాల్… ప్రత్యేక శ్రద్ధ

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై దేశ ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ కూడా ఆరా తీశారు. ఆయనకు నేరుగా ఫోన్ చేసి పరామర్శిస్తూ, త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ చర్య ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత స్పష్టం చేసింది.

55
అభిమానుల్లో ఊరట

శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో అభిమానులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే మరింత ఉత్సాహంతో తిరిగి తన బాధ్యతలను చేపడతారని అందరూ ఆశిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories