చిత్తూరు : ఓ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదని దర్గాకు వెళ్లిన తల్లిదండ్రులను ఓ మాంత్రికుడు ఏమార్చాడు. అమ్మాయికి ధనపిశాచి పట్టిందని జోస్యం చెప్పాడు. ఎక్కడికి తీసుకువెళ్లినా.. అది నయం కాదని నమ్మించాడు. మీ ఇంట్లో కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు ఉన్నాయి. దానిని పట్టుకున్న ధనపిశాచి మీ కూతురి ఒంట్లో చేరింది. అందుకే ఆమె జబ్బున పడింది. అని కట్టు కథలు చెప్పి, వారిని నమ్మించాడు.