ఈ నెల 11వ తేదీన తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలోకి నారా లోకేష్ పాదయాత్ర ప్రవేశించింది. లోకేష్ పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించడానికి ముందే ఈ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది. లోకేష్ అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తే సహించబోనని పెద్దారెడ్డి చెప్పారు. లోకేష్ క్యాంప్ వద్దకు వెళ్లి తేల్చుకొంటానని చెప్పారు. అయితే లోకేష్ క్యాంప్ వద్దకు వస్తే పెద్దారెడ్డి పంచెలూడదీసి కొడతారని జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటరిచ్చారు.