ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ చట్టాన్ని గౌరవించాలి. కానీ ముఖ్యమంత్రి దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి, ఆయన ముఖ్య వ్యక్తిగత సలహాదారు తమకు తోచినట్టుగా.. ఎలాంటి సహేతకత లేని కారణాలతో అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో విచారణలో వెలుగులోకి రాని కొత్త విషయాలు ఏమీ పేర్కొలేదు. ముఖ్యమంత్రి నేరుగా అఫిడవిట్ దాఖలు చేయడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎన్ఐఏను బైపాస్ చేశారు. సీఎంకు, ఆయన ముఖ్య వ్యక్తిగత సలహాదారుకే ఇలా ఎందుకు చేశారనేది తెలియాలి, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నందున.. కోర్టుకు రావడం నామోషిగా అనుకుంటున్నారు. అందుకే కోర్టు విచారణ వీలైనంతగా సాగదీస్తున్నారు.