ఈ నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా టైర్-2, టైర్-3 నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, రాంచి, నాశిక్, రాయ్పూర్, రాజ్కోట్, ఆగ్రా, మధురై, వడోదర, జోధ్పూర్ ఉద్యోగ నియామకాల్లో గణనీయమైన స్థానం సంపాదించాయి. మెట్రోలకు భిన్నంగా జీవన వ్యయం తక్కువగా ఉండటం, ఆకర్షణీయమైన మౌలిక సదుపాయాలు ఉండటం వంటివి ఈ నగరాలకు అనుకూలంగా మారాయి. కంపెనీలు కూడా ఇప్పుడు తమ కార్యకలాపాలను ఈ నగరాలకు విస్తరిస్తున్నాయి.