భార్య బరువెక్కుతోందని ఈ భర్త ఏం చేశాడో తెలుసా..? యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలా..!

Published : May 06, 2026, 12:25 PM IST

కట్టుకున్న భార్య బరువెక్కడంతో భారంగా భావించాడు ఓ కిరాతకుడు. యూట్యూబ్ లో సెర్చ్ చేసి మరి ఆమెతో అత్యంత దారుణంగా వ్యవహరించాడు. ఏపీలో వెలుగుచూసిన ఈ ఘటనలో అసలు ఏం జరిగిందంటే..? 

PREV
14
భార్యాభర్తల బంధానికే మచ్చలాంటి దారుణం...

ఈ కలికాలంలో మానవ సంబంధాలకు విలువే లేకుండా పోయింది... మరీముఖ్యంగా భార్యాభర్తల బంధం పూర్తిగా బలహీనం అయిపోయింది. జీవితాంతం కలిసి జీవించాల్సినవాళ్లు చిన్నచిన్న కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు... వైవాహిక జీవితాన్ని విచ్చిన్నం చేసుకుంటున్నారు. ఇంకొందరు మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారు... జీవిత భాగస్వామిని కిరాతకంగా చంపుతున్నారు. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ప్రియురాలి కోసం భార్యను చంపిన భర్త... ఇలాంటి వార్తలు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. కానీ ఓ దుర్మార్గుడు భార్య లావుగా ఉందని అంతమొందించాడు... ఈ ఘటన మన తెలుగు రాష్ట్రంలోనే వెలుగుచూసింది.

24
అసలేం జరిగింది...?

ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్ ముద్దునూరుకు చెందిన పద్మజను పెళ్లిచేసుకున్నాడు. పెళ్ళి సమయంలో కూడా పద్మజ కాస్త లావుగా ఉండేది... కానీ ఆమె ఆస్తిపై కన్నేసిన కిరణ్ ఇల్లరికం వెళ్ళాడు. ఇలా ఈ దంపతులు ముద్దునూరు కొత్తకొట్టాలలో నివాసం ఉండేవారు... వీరికి ఓ అమ్మాయి సంతానం.

అయితే సాప్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న కిరణ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటివద్దే పని చేసేవాడు. కొంతకాలం వీరి సంసారం సాఫీగానే సాగింది... కానీ ఇటీవల కాలంలో కిరణ్ భార్యపై ద్వేషం పెంచుకున్నాడు. ఆమె లావుగా ఉండటంతో అందంగా లేదని భావించాడు.. సన్నగా మారాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయినా భార్య బరువు తగ్గకపోవడంతో ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

34
భార్యను ఎలా చంపాలి..? యూట్యూబ్ లో సెర్చ్

భార్యను ఈజీగా ఎలా చంపాలో కిరణ్ యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతడికి ఓ ఫోన్ నెంబర్ లభించిందని... వారికి కాల్ చేస్తే కొరియర్ లో విషం తెప్పించుకున్నాడని తెలిపారు. పద్మజ కుటుంబసభ్యులతో ఇబ్బందులు రాకుండా తన స్వస్థలం ప్రొద్దుటూరులో ఈ మర్డర్ ప్లాన్ చేశాడు.

తల్లిదండ్రులను చూసొద్దామని చెప్పి భార్య పద్మజను ప్రొద్దుటూరుకు తీసుకెళ్లాడు కిరణ్. అక్కడ ఆమెకు అనుమానం రాకుండా ప్రేమ కురిపించాడు... ఈ క్రమంలోనే పాలకోవా తీసుకువచ్చి అందులో విషం కలిపాడు... దీన్ని భార్య పద్మతో తినిపించాడు. భర్త ప్రేమగా ఇవ్వడంతో ఆ అమాయకురాలు పాలకోవా తినేసింది... తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

అయితే విషం తిన్నా పద్మజ ప్రాణాలు కోల్పోలేదు... దీంతో భర్త కిరణ్ ఆమెను మరింత దారుణానికి పాల్పడ్డాడు. భార్య ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశాడు... దీంతో విలవిల్లాడిపోయిన ఆమె చివరకు ప్రాణాలు కోల్పోయింది. ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు గుండెపోటుతో భార్య చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు.

44
పోస్టుమార్టంలో బయటపడ్డ అసలు నిజం...

కిరణ్ మాటలను పద్మజ పుట్టింటివారు కూడా నమ్మారు... ఆమె నిజంగానే గుండెపోటుతో చనిపోయిందని భావించారు. కానీ పోలీసుల ఎంట్రీతో అతడి ప్లాన్ ఫెయిల్ అయ్యింది... అనుమానాస్పద మరణంగా భావించి పోస్టమార్టం చేయించారు. దీంతో అసలు నిజం బైటపడింది... ఆమె శరీరంలో విషం ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో కిరణ్ ను విచారించగా అసలు నిజం చెప్పాడు... భార్యను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

Read more Photos on
click me!

Recommended Stories