గ్యాస్ లీకేజితో పిట్టలా రాలుతున్న జనాలు, ఎల్‌.జి.పాలిమర్స్ చరిత్ర ఇదీ....

First Published May 7, 2020, 9:30 AM IST

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి విషవాయువు విడుదలై ప్రమాదం సంభవించింది. అర్థరాత్రి సుమారు 2 నుంచి మూడు గంటల మధ్య ప్రాంతాల్లో ఈ కంపెనీలోని విషవాయువు స్టైరిన్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది. 

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి విషవాయువు విడుదలైప్రమాదం సంభవించింది. అర్థరాత్రి సుమారు 2 నుంచి మూడు గంటల మధ్య ప్రాంతాల్లోఈ కంపెనీలోని విషవాయువు స్టైరిన్లీకైదాదాపు మూడు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించింది.
undefined
చుట్టుపక్కల కనీసం 20గ్రామాలకు ఈ వాయువు వ్యాపించింది. ఇప్పటికే ముగ్గురు మరణించగా వందల మంది ఆసుపత్రుల్లోచికిత్స పొందుతున్నారు.
undefined
చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర స్వస్థత పాలయ్యారు.అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్‌ లో ఆసుపత్రికితరలించారుపోలీసులు.
undefined
ప్రజలు భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు, దీనివల్ల గ్యాస్ మరింత మందిని బలితీసుకునే ఆస్కారమున్నందున, పోలీసులు సైరెన్మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా ప్రజలకు సూచిస్తూ... వారిని తరలిస్తున్నారు.
undefined
ఇక అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులుఉన్నారు. ఈ కంపెనీ ప్రఖ్యాతఎలక్ట్రానిక్స్ పరికరాలను తయారు చేసే ఎల్. జి. కంపెనీకి చెందినదే. ఈ కంపెనీ పాలీస్టైరిన్ను తయారు చేస్తుంది.
undefined
1961లో హిందూస్తాన్పాలిమర్స్గా ఏర్పాటైన ఈ సంస్థను1978లో యూబీగ్రూపుతో కలిసింది. ఆ తరువాతకొరియాకు చెందిన ఎల్.జి కంపెనీ దీనిని కొనుగోలు చేసింది. 1997లో దీని పేరు మర్చిఎల్.జి పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా నామకరణం చేసారు.
undefined
విషవాయువును పీల్చడం వల్ల అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు
undefined
click me!