వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఆదివారం రాత్రి నుంచి తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా.. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, రాజమహేంద్రవరం, నగరి, చిత్తూరు, రాయచోటి, కడప, కావలి, చీరాల, మచిలీపట్నం, ఏలూరు, విజయవాడ, తుని, విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.