ఓ యజ్ఞంలా ఏపీలో మొక్కల పెంపకం... మన లక్ష్యమిదే: వన మహోత్సవంలో సీఎం జగన్

First Published Aug 5, 2021, 3:02 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన ''జగనన్న పచ్చ తోరణం–వన మహోత్సవం2021'' కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావి, వేప చెట్లను నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 
 

మంగళగిరి: రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23 శాతం మాత్రమే ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచే దిశగా అందరం ప్రయత్నం చేయాలన్నారు. ఇందుకోసం మనందరం కలిసి చెట్లను నాటి, వాటిని సంరక్షించేందుకు బాధ్యత తీసుకోవాలని సీఎం రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు.
undefined
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన ''జగనన్న పచ్చ తోరణం–వన మహోత్సవం2021'' కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావి, వేప చెట్లను నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
undefined
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత తమ మనసులో చెట్లను నాటి కాపాడతానని ప్రతిజ్ఞ చేయాలన్నారు. చెట్లకు తోడుగా అందరం కలిసికట్టుగా ఉండి అడుగులు వేస్తే మన రాష్ట్రంలో చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఇది జరగాలని కోరుకుంటున్నానని అన్నారు సీఎం జగన్.
undefined
''చెట్ల పెంపకానికి సంబంధించి రెండు, మూడు చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటే... అవి ఎంత అవసరమో మనకు నిరంతరం తెలుస్తుంది. ఒకటి.. మనం పీల్చే గాలి ఆక్సిజన్‌. ప్రపంచంలో ఏ జీవి అయినా ఆక్సిజన్‌ను పీల్చుకుని కార్బన్ ‌డై ఆక్సైడ్‌ వదిలేస్తుంది. ఒక్క చెట్టు మాత్రమే పగటి పూట కార్భన్‌ డై ఆక్సైడ్‌ తీసుకుని ఆక్సిజన్‌ను వదులుతుంది. అంటే ఒక చెట్టు ఉంటే ప్యూర్‌గా ఉన్న ఆక్సిజన్‌ లెవెల్స్‌ మెరుగ్గా ఉంటాయన్నది ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం'' అన్నారు.
undefined
''రెండో అంశం.. చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కూడా కురిసే పరిస్ధితి ఉంటుంది. మనం పదో తరగతి చదువుల్లో, పరీక్షలు రాసేటప్పుడు తెలుసుకున్న విషయాలివి. ఆస్మోసిస్‌ అని, ట్రాన్సిపరేషన్, గటేషన్‌ అని రకరకాలు సిద్ధాంతాలు అన్నీ చదివాం. చెట్లు వలన వర్షం ఎలా ప్రభావితం అవుతుంది, ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఎందుకుంటాయి అనే ఈ రెండు విషయాలును జ్ఞాపకం ఉంచుకోవాలి'' అని సూచించారు.
undefined
''చెట్లు వలన మనకు జరిగే మంచిని మనం జ్ఞాపకం పెట్టుకుంటే, చెట్లను పెంచాల్సిన అవసరం ఎప్పుడూ కనిపిస్తుంది. ఈ రోజు దాదాపు 5కోట్ల మొక్కలను నాటడానికి అటవీశాఖను పురమాయిస్తూ... ప్రతిజ్ఞతో ఈ పనికి పూనుకోవాలని అందరినీ కోరుతున్నాను'' అని తెలిపారు.
undefined
''ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి, ప్రకృతిలోని సమతుల్య స్ధితి అవసరాన్ని గుర్తిస్తూ... ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా, వాడవాడా, ఇంటా బయటా, అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను'' అంటూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు సీఎం జగన్.
undefined
''మనసా, వాచా, కర్మణా అందరం ఈ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండి ఈ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని కోరుకుంటూ, మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను'' అంటూ సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
undefined
ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
undefined
click me!