ఆర్టీసీ కూడా విద్యార్థులకు బస్సు పాస్ సౌకర్యాన్ని విస్తరించింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే 12 ఏళ్ల లోపు బాలురకు, 15 ఏళ్ల లోపు పదోతరగతి బాలికలకు ఉచిత బస్ పాస్ లభిస్తుంది. అంతేకాక, గ్రామీణ ప్రాంతాల్లో 20 కిలోమీటర్ల పరిధిలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం విద్యార్థులు హెడ్మాస్టర్ సంతకం, స్కూల్ సీల్ ఉన్న దరఖాస్తు ఫారంతో పాటు, ఆధార్ కార్డు, ఫోటో, రూ.70 రుసుముతో కూడిన ID కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది.