జిల్లాల వారీగా ఖాళీలు ఇలా..
ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ప్రకారం. మొత్తం 16,347 పోస్టులు ఉన్నాయి. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, ప్రిన్సిపాళ్లు 52, పీఈటీలు 132 పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా .. శ్రీకాకుళం 543, విజయనగరం 583, విశాఖపట్నం 1,134, తూర్పుగోదావరి 1,346, పశ్చిమ గోదావరి 1,067, కృష్ణా 1,213, గుంటూరు 1,159, ప్రకాశం 672, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 673, చిత్తూరు 1,478, వైఎస్సార్ కడప 709, అనంతపురం 811, కర్నూలు 2,678 ఖాళీలు భర్తీ చేయనున్నారు. గురుకుల, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన పాఠశాలల్లో 2,281 ఖాళీలు ఉన్నాయి.