విశాఖ దుర్ఘటనను మరువక ముందే ప్రకాశం ప్రమాదం... చంద్రబాబు, లోకేశ్ ల ఆవేదన

First Published May 14, 2020, 10:22 PM IST

ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై స్పందిస్తూ ఏపి గవర్నర్ బిశ్వభూషణ్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

గుంటూరు: విశాఖపట్నంలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ దుర్ఘటనను మరువక ముందే ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరగి రైతు కూలీలు మృతిచెందడం తీవ్రంగా కలచివేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయనతో పాటు ఏపి గవర్నర్, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
undefined
''వరుసబెట్టి ప్రజల ప్రాణాలు హరిస్తున్న ప్రమాదాలు మనసును కలచివేస్తున్నాయి. విశాఖలో విషవాయువు 12 మందిని బలి తీసుకున్న ఘటన జరిగి వారం తిరక్క ముందే ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర మరో ఘోరప్రమాదంలో 9 మంది వ్యవసాయకూలీలు మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది'' అంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికన తన ఆవేదనను వ్యక్తం చేశారు.
undefined
''మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరణించినవారంతా కూలీలుకాబట్టి ప్రభుత్వం మానవతాదృక్పథంతోవారి కుటుంబాలకు అండగానిలవాలి. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్సనుఅందించాలి'' అని వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
undefined
''ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర జరిగిన ఘోరప్రమాదంలో 10 మంది మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక తెలుగుదేశం నాయకులను ఆరాతీయగా ప్రమాదానికి గురైన వారంతా మిరపకోతకు వెళ్ళొస్తున్న వ్యవసాయకూలీలని తెలిసింది. ఇది చాలా బాధాకరం'' అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
undefined
''లాక్ డౌన్ కష్టాల నుండి వెసులుబాటు దొరికి ఇప్పుడిప్పుడే పనులకు వెళ్తున్న సమయంలో ఇలా జరగడం దారుణం. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'' అని లోకేశ్ వెల్లడించారు.
undefined
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో జరిగిన ట్రాక్టరు ప్రమాదంలో కూలీలు దుర్మరణం పాలైన సంఘటనపై ఆంధ్రపద్రేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. విద్యుత్ స్తంభానికి ట్రాక్టర్ ఢీ కొన్న నేపధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా, పలువురు మహిళలు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు వేగంగా అందాలని ఆకాంక్షించారు.
undefined
click me!