ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర సరకులైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో అందనంత ఎక్కువలో ఉన్న నిత్యవసర సరకుల ధరలను నెల రోజుల వ్యవధిలోనే రెండో సారి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.