Egg Mart Scheme for Womens : ఏ వ్యాపారం చేయాలన్నా పెట్టుబడికి డబ్బులు అవసరం. కానీ పైసా పెట్టుబడిలేకుండా మంచి లాభధాయకమైన వ్యాపారం చేసే అవకాశం తెలుగు మహిళలకు వచ్చింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగు మహిళల కోసం ఎగ్ మార్ట్ స్కీమ్..? అంటే ఏమిటి..?
Women Empowerment Scheme : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక పథకాలు అమలుచేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో మహిళల ఖర్చులు తగ్గించి డబ్బులు ఆదా చేస్తోంది... మరోవైపు సొంతంగా ఆదాయాన్ని పొంది ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకరిస్తోంది. ఇలా గ్రామీణ ప్రాంతాల మహిళలకు వ్యవసాయం, పాడి రంగాల్లో ఆదాయంపొందేలా వడ్డీలేని రుణాలు, డ్రోన్ స్ప్రేయర్లు వంటివి అందిస్తోంది. ఇదే తరహాలో పట్టణప్రాంత మహిళల కోసం మరో సరికొత్త పథకాన్ని అమలుచేసేందుకు సిద్దమయ్యింది కూటమి ప్రభుత్వం.
26
మహిళలకు ఉచితంగా రూ.50000...
గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోని పేదలే ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. గ్రామాల్లో జీవనవ్యయం చాలా తక్కువ.. కానీ పట్టణాల్లో ఇంటి అద్దె నుండి కుటుంబ పోషణ వరకు ప్రతిదీ ఖర్చే. సరైన ఆదాయం లేక ఎన్నో కుటుంబాలు ఆకలితో అలమిటుస్తున్నాయి... పేదరికంలో మగ్గిపోతున్నాయి. ఇలాంటి పట్టణ ప్రాంతాల్లోని పేదింటి మహిళలకు అండగా నిలిచేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా రూ.50,000 సాయం చేస్తోంది.
36
పేద మహిళలకు బిజినెస్...
పట్టణాలు, నగరాల్లో నివాసముండే పేదింటి మహిళలకు ప్రభుత్వమే వ్యాపారం పెట్టివ్వనుంది. ఇందుకోసం ఇప్పటికే నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. జిల్లాకు 10 చొప్పున మొత్తం 260 ఎగ్ మార్ట్ లను ఏర్పాటు చేయనున్నారు... ఇందుకయ్యే ఖర్చు రూ.50,000 ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ఎగ్ మార్ట్ లను దక్కించుకున్న మహిళలు రూపాయి తిరిగి కట్టాల్సిన అవసరం లేదు.
అయితే ప్రభుత్వ నేరుగా డబ్బులివ్వడం కాకుండా వ్యాపారాన్ని ఏర్పాటుచేసి ఇస్తుంది. పట్టణాలు, నగరాల్లో ఎంపికచేసిన రద్దీ ప్రాంతాల్లో ఈ ఎగ్ మార్టులను పెట్టనున్నారు. రూ.35 వేలతో చిన్న స్టోర్ ఏర్పాటుచేసివ్వడంతో పాటు రూ.15 వేల విలువైన గుడ్లు అందించనున్నారు. ఇలా రూ.50 వేల ఖర్చుతో వ్యాపార అవకాశం కల్పిస్తూ మహిళలు మంచి ఆదాయాన్ని పొందుతూ ఆత్మగౌరవంతో జీవించేలా సరికొత్త పథకం అమలుచేస్తోంది ప్రభుత్వం.
ఎగ్ మార్ట్ ల నిర్వహణ బాధ్యత ఎవరికి అప్పగించాలన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయం సంఘాల్లో అత్యంత పేదరికంతో బాధపడేవారు, ఒంటరిగా ఉండే మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. అర్హుల ఎంపిక బాధ్యత మెప్మా (Mission for Elimination of Poverty in Municipal Areas) కు అప్పగించింది చంద్రబాబు సర్కార్.
56
ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
ఎగ్ మార్ట్ వ్యాపారంపై ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెప్మా కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మహిళల నుండి వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులను అధికారులే నిర్ణయిస్తారు. ఇలా ఎగ్ మార్ట్ లను పొందిన మహిళలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో గుడ్లకు మంచి గిరాకీ ఉంది... కాబట్టి ఎగ్ మార్ట్ ల నిర్వహణ ద్వారా మహిళలు మంచి ఆదాయం పొందవచ్చు.
66
పెట్టుబడి లేకుండానే వ్యాపారి అయిపోవచ్చు..
రాష్ట్ర ప్రభుత్వం, NECC సాయంతో పైసా ఖర్చులేకుండా ఎగ్ మార్ట్ బిజినెస్ ప్రారంభించవచ్చు. అంతేకాదు ఇందులో వివిధ రకాల అహార పదార్థాలు కూడా అమ్ముకోవచ్చు. ఇలా మహిళలు మంచి ఉపాధిని పొందవచ్చు... ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. కాబట్టి పట్టణ ప్రాంతాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి.