ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు... జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్ (ఫోటోలు)
First Published Nov 1, 2022, 3:07 PM ISTవిజయవాడ : నేడు (నవంబర్ 1న) ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకను వైసిపి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.