వరద బాధితులను ఆత్మీయంగా పలకరిస్తూ... చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)
First Published Dec 3, 2021, 10:39 AM ISTతిరుపతి: వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు. మొదట ఏర్పేడు మండలం పాపానాయుడు పేట వద్ద స్వర్ణముఖి నది వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం జిల్లావ్యాప్తంగా ఆర్ అండ్ బీ, జలవనరులు, వ్యవసాయంతో సహా వివిధ శాఖలకు సంబంధించి వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సీఎం పరిశీలించారు.
రేణిగుంట మండల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలు వేదాళ్ల చెరువు, ఎస్టీ కాలనీలలో సీఎం జగన్ పర్యటించారు. వరద బాధితులను పరామర్శిస్తూ సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆత్మీయంగా పలకరిస్తూ సీఎం జగన్ ముందుకు కదిలారు.