ఏపీలో కరోనా వ్యాప్తి: ఇతర రాష్ట్రాల్లో నేతల చికిత్స, జగన్ కు చిక్కులు

First Published Jul 16, 2020, 2:15 PM IST

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అంజద్ భాషాకు కరోనా సోకింది. ఆయన తొలుత తిరుపతిలోని స్విమ్స్ లో చికిత్స పొందినప్పటికీ... ఆదివారం నాటికి  హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. 

దేశమంతా కరోనా వైరస్ కేసులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి దెబ్బకు దేశం విలవిల్లాడిపోతోంది. అన్ని రాష్ట్రాలనూ ఈ మహమ్మారి కుదిపేస్తోంది. ఇకపోతే.... అత్యధిక టెస్టులు చేస్తూ కరోనా వైరస్ కట్టడిలో ముందున్నామంటూ చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతోపాటుగా మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది.
undefined
ఆంధ్రప్రదేశ్ లో మరణాల రేటు ఎక్కువగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ పై తీవ్రమైన ఆరోపణలు ఆవస్తున్నాయి. దాదాపుగా 30 నుంచి 40 మరణాలు గత కొన్ని రోజులుగా వరుసగా నమోదవుతున్నాయి. ఈ స్థాయిలో మరణాలు నమోదవుతుండడంతో.... రాష్ట్రంలో కరోనా వైరస్ హ్యాండ్లింగ్ పైన్నే విపక్ష నేతలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
undefined
మరణాలు ఎక్కువగా సంభవిస్తుండడంతో... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కోవిడ్ నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.... కరోనా మరణాలు ఎక్కువగా నమోదవడానికి ఏపీలోకివస్తున్న తెలంగాణవారు కారణం అని చెబుతూ... తెలంగాణ మీదికి తోసేసి ప్రయత్నం చేసారు.తెలంగాణను హై రిస్క్ జోన్ గా కూడా గుర్తించారు.
undefined
తెలంగాణ ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క చాలా మంది కరోనా రోగులు మందులువేసుకొని జ్వరం తగ్గించుకొని పాసులకు అప్లై చేసుకొని ఏపీలోకి ఎంటర్ అవుతున్నారని ఆయన అన్నారు. దీనికి తెలంగాణ సరిహద్దు జిల్లాలైనకృష్ణ, కర్నూల్ జిల్లాల్లోనే అత్యధిక మరణాలు నమోదవడాన్ని నిదర్శనంగా చూపుతున్నారు.
undefined
అయితే గత రెండు రోజులుగా గనుక చూసుకుంటే... ఏపీలోని అనంతపూర్, గోదావరి జిల్లాల్లో కరోనా మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాలకంటే ఈ జిల్లాల్లోనేమరణాలు ఎక్కువగా ఈ జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. ప్రభుత్వ అధికారిక లెక్కలే దీన్ని ధ్రువీకరిస్తున్నాయి.
undefined
నిన్న కర్నూల్, పశ్చిమ గోదావరిజిల్లాల్లో 9 మంది చొప్పున మరణించగా, మొన్న 14వ తేదీనాడు అనంతపూర్ లో 10, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది మరణించారు. ఓవరాల్ గా కృష్ణ, కర్నూల్ జిల్లాలతో పోల్చుకుంటే మరణాలు తక్కువగానే ఉన్నప్పటికీ.... మిగిలిన జిల్లాల్లో కూడా మరణాలు పెరుగుతున్నాయి అనేది ఇక్కడ నిర్వివాదాంశం.
undefined
ఈ మరణాల రేటును పక్కకుంచితే.... ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అంజద్ భాషాకు కరోనా సోకింది. ఆయన తొలుత తిరుపతిలోని స్విమ్స్ లో చికిత్స పొందినప్పటికీ... ఆదివారం నాటికి హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రికి షిఫ్ట్ అయిచికిత్సపొందుతున్నారు.
undefined
ఈయనొక్కడేకాదు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సైతం ట్రీట్మెంట్ కోసం రాష్ట్రం దాటారు. ఆయన చెన్నైలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. టీడీపీ వర్గాల ఆరోపణను అటుంచితే... రాష్ట్రంలోని నాయకులకు కరోనా వస్తే రాష్ట్రంలోని ఆసుపత్రులు నయం చేయలేవా అనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న.
undefined
తెలంగాణ రాష్ట్రంలో చికిత్స అందిస్తున్నప్పటికీ.... అక్కడ ట్రీట్మెంట్ పై ప్రజలు సంతృప్తిగా లేక, బెడ్లు దొరక్కఆంధ్రప్రదేశ్ లో బాగుందని వస్తున్నారు అని ప్రభుత్వం చెబుతున్న వేళ.... ఏపీ ప్రజాప్రతినిధులే ఇలా తెలంగాణకు వెళ్లి చికిత్స చేపించుకోవడం నిజంగా ఆశ్చర్యకరం.
undefined
తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేపించుకున్నప్పుడే సమాజమంతా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం బాగోలేదా అనినిలదీసింది. (ప్రజలు నిలదీసినప్పుడే ప్రజాస్వామ్యం మరింత అర్థవంతంగా తయారవుతుంది.) ఇప్పుడు ఏపీ ప్రజాప్రతినిధులు ఏకంగా రాష్ట్రాలే దాటుతున్నారు. వీరినేమనాలి? ఇది ప్రభుత్వానికి సైతం ఇబ్బందికరమే..!
undefined
click me!