పీవీ రమేష్ మాస్క్ పంచ్: ఎపీ సీఎం జగన్ టార్గెట్

First Published Jul 14, 2020, 3:45 PM IST

తాజాగా పీవీ రమేష్ ట్విట్టర్ వేదికగా చేసిన ఒక కామెంట్ ఇప్పుడురాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ సాధారణంగా మాస్క్ లేకుండా సంచరిస్తాడన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఆయన ఉన్నట్టుండి ఒక రెండు రోజులకింద మాస్క్ తో దర్శనమిచ్చాడు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారుల్లో అజయ్ కల్లాం, పీవీ రమేష్ ల అధికారాలను జగన్ పూర్తిగా కట్ చేసి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ కూడా ఎటువంటి సబ్జక్ట్స్ లేకుండా ఖాళీగా సలహాదారులుగా కార్యాలయంలో మిగిలిపోయారు.
undefined
పీవీ రమేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఈ కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ లోని టెస్టుల దగ్గరి నుండి రాష్ట్రంలోకి వచ్చిపోయేవారి వివరాలని ఇతరాత్రాలను మేనేజ్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు ఈ విషయంలో ఎంత గుర్తింపు వచ్చిందో అందరికి తెలిసిందే.
undefined
జగన్ నిర్ణయంతో ఖాళీగా ఉంటున్న రమేష్ కుమార్ బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలను చేయలేదు. సోషల్ మీడియాలో తాను రోజు వారీగా కరోనా కష్టకాలంలో షేర్ చేసే విషయాలను, ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ తన దైనందిన జీవితాన్ని గడుపుతున్నాడు.
undefined
తాజాగా పీవీ రమేష్ట్విట్టర్ వేదికగా చేసిన ఒక కామెంట్ ఇప్పుడురాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ సాధారణంగా మాస్క్ లేకుండా సంచరిస్తాడన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఆయన ఉన్నట్టుండి ఒక రెండు రోజులకింద మాస్క్ తో దర్శనమిచ్చాడు.
undefined
ట్రంప్ మాస్క్ తో కనబడడంతో అందరూ కూడా ట్రంప్ ఎట్టకేలకు కరోనా వైరస్ తీవ్రతను గుర్తించినట్టున్నాడు అని ట్వీట్ చేస్తున్న విషయం తెలిసిందే. మాస్క్ ధరించిన ట్రంప్ ఫోటోను ఉంచి ప్రపంచంలోని నేతలందరూ ఇలా మాస్కులను ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తే బాగుంటుందని ట్వీట్ చేసాడు రమేష్ కుమార్.
undefined
ఇందులో ఏముంది అని అనిపించొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సాధారణంగా మాస్క్ ధరించి మనకు ఎక్కువగా కనిపించరు. ఆయన చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మాస్క్ ధరించి కనబడ్డారు. మొన్న అంబులెన్సులను ప్రారంభించేప్పుడు ఇలా కొన్ని సందర్భాల్లో మాస్క్ తో దర్శనం ఇచ్చారు. మిగితా సందర్భాల్లో మాస్క్ ధరించలేదు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాస్క్ ధరించలేదు.
undefined
ఇప్పుడు పీవీ రమేష్ ట్వీట్ జగన్ ని టార్గెట్ చేసిందేనా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఆ ఒక్క ట్వీట్ తో ఆగకుండా, రమేష్ కుమార్ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన మరో వ్యక్తి ట్వీట్ ను సైతం రీట్వీట్ చేసారు రమేష్ కుమార్. రమేష్ కుమార్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ ఒక సీనియర్ సిటిజెన్ అమెరికా అధ్యక్షుడు మాస్క్ ధరించకపోవడం వల్ల అమెరికాలో ప్రజలు కూడా మాస్కులు ధరించడంలేదనే ఒక విషయాన్నీ ఉదాహరనతోచెప్పారు.
undefined
రమేష్ కుమార్ ఈ ఒక్క విషయమే కాదు, వాలా అఫ్సర్ ట్వీట్లను రీట్వీట్ చేసారు. అందులో పనిచేసే చోట నమ్మకం ఉండాలి అనే అర్థం వచ్చే విధంగా ఉన్నాయి. మరో ట్వీట్లో మాస్కు ధారణకు సంబంధించిన మరో పంచ్ దాగి ఉంది.
undefined
ఈ అన్ని పరిస్థితులను బట్టి చూస్తుంటే... రమేష్ కుమార్ ట్వీట్లు జగన్ ని ఉద్దేశించినవేనా అనే అనుమానం కలుగుతుంది. ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో కూడా అనేక చర్చలు నడుస్తున్నాయి. ట్రంప్, జగన్ ఫోటోలు పక్కపక్కనపెట్టి మరి ట్రోల్ చేస్తున్నారు.
undefined
click me!