అవంతి వ్యాఖ్యలు: నెక్ట్స్ టార్గెట్ గంటా శ్రీనివాసరావేనా?

First Published Jul 16, 2020, 12:44 PM IST

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు గురువారం నాడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.

వైసీపీ ప్రభుత్వ నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావేనా? మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యలు ఇవే సంకేతాలు ఇస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే టీడీపీకి చెందిన నేతలపై వరుస కేసులు ఆ పార్టీని ఇబ్బందుల్లో పెడుతున్నాయి. కొందరు నేతలు కొన్ని కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్నారు.
undefined
ఇప్పటికే రాష్ట్రంలోని టీడీపీకి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు కేసుల్లో ఇరుక్కొన్నారు. కొందరు అరెస్టయ్యారు. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ దృష్టి గంటా శ్రీనివాసరావుపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.మంత్రిగా ఉన్న సమయంలో సైకిళ్ల కొనుగోళ్లలో గంటా శ్రీనివాసరావు అవినీతికి పాల్పడినట్టుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
undefined
ఇప్పటికే మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలు అరెస్టయ్యారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు, వైసీపీ నేత భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రలు అరెస్టయ్యారు.
undefined
ఈఎస్ఐ స్కాంలో మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుటుంబంపై కూడ ఆరోపణలు వచ్చాయి. పితాని సత్యనారాయణ తనయుడు సురేష్ కోసం ఏసీబీ గాలింపు చర్యలు చేపడుతోంది. పితాని సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది.
undefined
విశాఖ జిల్లాలో భూ కుంభకోణాలపై అప్పట్లో టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సమయంలో విపక్షాలు మంత్రి గంటా శ్రీనివాసరావుపై విమర్శలు చేశాయి. రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరమైన తర్వాత గంటా శ్రీనివాసరావు టీడీపీకి కొంచెం దూరంగా ఉంటున్నారు.
undefined
గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసినందుకు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ విషయంలో తన అనుచరుడి కోసం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.ఏదైనా ఉంటే తనతో తేల్చుకోవాలని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తన అనుచరులపై కేసులు పెట్టి వేధింపులకు పాల్పడవద్దని ఆయన కోరారు.
undefined
విశాఖ జిల్లాలో తన పట్టును పెంచుకొనేందుకు మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకొన్నట్టుగా కన్పిస్తోంది.ఇద్దరూ కూడ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. మంత్రిగా అవంతి శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత గంటా శ్రీనివాసరావు లక్ష్యంగా గతంలో అనేక విమర్శలు చేశారు. గురువారం నాడు చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా సంచలనానికి దారి తీస్తున్నాయి.
undefined
విశాఖపట్టణం జిల్లా నుండి అవంతి శ్రీనివాసరావు ఒక్కరే జగన్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. కాపు సామాజిక వర్గం నుండి ఆయనకు కేబినెట్లో చోటు దక్కింది. ఎన్నికల ముందు టీడీపీ నుండి వైసీపీలో చేరినా కూడ అవంతికి జగన్ మంత్రి పదవిని ఇచ్చారు.
undefined
భీమీలి నుండి వైసీపీ నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి సబ్బం హరిపై ఆయన విజయం సాధించారు. గతంలో ఇదే నియోజకవర్గం నుండి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహించారు. అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యలు మైండ్ గేమ్ లో భాగంగా చేసినవా... లేదా భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఇచ్చిన సంకేతమా అనేది త్వరలో తేలనుంది
undefined
click me!