ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్ జగన్...తండ్రి వైఎస్సార్ కు ఘన నివాళి
First Published Dec 24, 2020, 11:13 AM ISTఇడుపులపాయ: తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. గురువారం ఉదయం వైయస్సార్ జిల్లాలోని ఇడుపులపాయకు చేరుకున్న జగన్ నేరుగా వైయస్సార్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. అనంతరం తండ్రి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.