పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదుకు ఏపీ రె'ఢీ'

First Published May 15, 2020, 1:13 PM IST

తెలంగాణ రాష్ట్రం పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపుపై ఫిర్యాదు చేస్తే.... తెలంగాణపై ఫిర్యాదు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కూడ సిద్దమైంది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ ఫిర్యాదుకు రంగం సిద్దం చేసింది. 

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ ప్రభుత్వం కూడ ఎదురు దాడికి సిద్దమైంది. గోదావరితో పాటు కృష్ణా నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తమ అభ్యంతరాలను తెలుపుతూ ఏపీ ప్రభుత్వం లేఖలను సిద్దం చేస్తోంది. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వంపై రెండు బోర్డులకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
undefined
పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు ఈ నెల 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది.ఈ జీవో జారీ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
undefined
పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచితే తెలంగాణలోని నల్గొండ, మహాబూబ్ నగర్ జిల్లాలో ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయమై కృష్ణా బోర్డుకు కూడ ఫిర్యాదు చేసింది తెలంగాణ సర్కార్. మరో వైపు ఈ విషయమై సుప్రీంకోర్టును కూడ ఆశ్రయించనున్నట్టుగా ప్రకటించింది.
undefined
కృష్ణా జలాలపై తమ రాష్ట్రానికి ఉన్న 512 టీఎంసీల నీటిని వాడుకొనేందుకు వీలుగా పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతుంది.
undefined
ఈ మేరకు ఈ నెల 5వ తేదీన జారీ చేసిన 203 జీవోలో రూ.6,29.15 కోట్లకు పరిపాలనా అనుమతులను కూడ మంజూరు చేసింది.వరద జలాలపై ఆధారపడే ఈ ప్రాజెక్టులు నిర్మిస్తున్న విషయాన్ని ఏపీ ప్రభుత్వం తెలిపింది. వరద జలాలపై ఈ ప్రాజెక్టుల నిర్మిస్తోంటే తెలంగాణకు అభ్యంతరం ఏమిటని ఆ రాష్ట్రం ప్రశ్నిస్తోంది.
undefined
పాలమూరు-రంగారెడ్డి నుండి 90 టీఎంసీలు, డిండి రిజర్వాయర్ నుండి 10 టీఎంసీలు, మిషన్ భగీరథ నుండి 19.59 టీఎంసీలు, తుమ్మిళ్ల ఎత్తిపోతల నుండి 5.44 టీఎంసీలు, భక్త రామదాసు ఎత్తిపోతల నుండి 5.50 టీఎంసీలు, కల్వకుర్తి సామర్ధ్యం పెంచడం ద్వారా 10 టీఎంసీలు, జూరాల ఫోర్ షోర్ నుండి నెట్టెంపాడు సామర్ధ్యం పెంచడం ద్వారా 3.40 టీఎంసీలతో తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మొత్తం 178.93 టీఎంసీల నీటితో ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఏపీ ప్రభుత్వం తెలంగాణపై ఫిర్యాదు చేయనుంది.
undefined
గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అయితే ఈ ప్రాజెక్టుకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్టుగా తెలంగాణ చెబుతోంది.
undefined
ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మించతలపెట్టిన తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉన్నందున కాళేశ్వరానికి ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చినట్టుగా తెలంగాణ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. గోదావరి, కృష్ణా బోర్డులకు వేర్వేరుగా ఏపీ ప్రభుత్వం లేఖలను పంపనుంది. ఈ లేఖల ప్రతులను సీడబ్ల్యుసీకి కూడ పంపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
undefined
click me!