ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... స్కిల్ సెన్సెస్ ప్రక్రియ గురించి వివరించారు. నిర్దేశిత సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వివరాలను సేకరించడంతో పాటు ఆన్ లైన్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో వున్న యువత కూడా వివరాలు అందించే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇలా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి వారి నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలా యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందడం ద్వారా వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని లోకేష్ పేర్కొన్నారు. ఇదే స్కిల్ సెన్సెస్ ముఖ్య ఉద్దేశమని అన్నారు.