దుబాయ్ చేరిన ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాం.. ఈడీ దర్యాప్తు ముమ్మరం

Published : Sep 19, 2025, 09:04 PM IST

Andhra Pradesh liquor scam: ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాం దర్యాప్తు దుబాయ్ వరకు చేరింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొత్త ఆధారాలు సేకరించి నిందితులపై దర్యాప్తును వేగవంతం చేసింది.

PREV
12
దుబాయ్ లో ఏపీ మద్యం స్కాం దర్యాప్తు

ఆంధ్రప్రదేశ్‌లో కోట్ల రూపాయల మద్యం స్కాం కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా సేకరించిన చాట్ ఆధారాల ప్రకారం కొందరు నిందితులు దుబాయ్‌లో ఉన్నారని తేలింది. దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్కామ్ లోని లాభాలను (Proceeds of Crime – POC) కోట్ల రూపాయల మేరకు విదేశాలకు పంపిన రికార్డులు లభించాయి. ఈ మొత్తాలు పరారీలో ఉన్న ప్రధాన నిందితుల ఖాతాలకు బదిలీ చేసినట్టు ఈడీ గుర్తించింది.

దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈడీ సోదాలు

సెప్టెంబర్ 18న ఈడీ హైదరాబాద్‌ జోన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పూర్, ఢిల్లీ ఎన్సీఆర్, ఆంధ్రప్రదేశ్‌లలో 20 ప్రదేశాల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, చాట్‌ ఆధారాలు, నకిలీ బిల్లులు, రవాణా చలాన్లు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధం లేని వివరాలతో కూడిన రవాణా చలాన్లు కూడా లభించాయి. ఒక ప్రాంగణం నుండి రూ.38 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పలు లెడ్జర్లలో విదేశాలకు బదిలీ చేసిన కోట్ల రూపాయల లావాదేవీలు నమోదు అయినట్లు ఈడీ పేర్కొంది.

22
ఆంధ్రప్రదేశ్ లిక్కస్ స్కామ్ లో సిట్, సీఐడీ కేసులు

ఆంధ్రప్రదేశ్ లిక్కస్ స్కామ్ కేసు సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ప్రభుత్వానికి సుమారు రూ.4,000 కోట్ల నష్టం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు అమల్లో ఉన్న కొత్త మద్యం విధానంలో అక్రమాలు జరిగినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ప్రముఖ బ్రాండ్లను పక్కన పెట్టి, కొత్త లేదా నకిలీ బ్రాండ్లను ప్రోత్సహించారనీ, 15–20 శాతం కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు. ఆటోమేటెడ్ సిస్టమ్‌ను రద్దు చేసి మాన్యువల్ ఆమోదాలను అమలు చేయడం వల్ల అక్రమాలకు అవకాశం లభించిందని సిట్ ఛార్జీషీట్లో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ లిక్కస్ స్కామ్ తాజా దర్యాప్తు విషయాలు

ఈడీ దర్యాప్తులో నిందితులు ప్రముఖ బ్రాండ్ల ఆర్డర్లను అడ్డుకున్నట్లు, డిస్టిలరీలకు చెల్లించాల్సిన బిల్లులు నిలిపివేసినట్లు తేలింది. అక్రమ కమీషన్ల కోసం ఒత్తిడి తెచ్చినట్లు కూడా బయటపడింది. APSBCL నుండి సరఫరాదారులకు చెల్లించిన కొంత మొత్తం నకిలీ సంస్థలకు బదిలీ అయ్యింది. ఈ లావాదేవీలు వాస్తవానికి లేవని, పలు నకిలీ కంపెనీలు, షెల్‌ సంస్థలు నిధుల తరలింపుకు వాడినట్లు ఈడీ పేర్కొంది. బంగారం కొనుగోలు చేసి నగదు రూపంలో నిందితులకు అందించినట్లు కూడా ఆధారాలు లభించాయి.

సీఐడీ 2024 జూలైలో దాఖలు చేసిన ఛార్జీషీట్ ప్రకారం.. మాజీ ఐటీ సలహాదారు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వైసీపీ నేత, ఎంపీ పి.వి. మిధున్ రెడ్డి ఈ స్కాం ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. వీరిద్దరూ అరెస్టు అయ్యారు. రూ.11 కోట్లు నగదు, మద్యం సీసాలు కూడా శంషాబాద్‌లోని ఒక ఫార్మ్ హౌస్‌లో స్వాధీనం చేసుకున్నారు. 30కి పైగా షెల్ కంపెనీల ద్వారా డబ్బును దుబాయ్, ఆఫ్రికాలో భూములు, బంగారం, లగ్జరీ ఆస్తులు కొనుగోలు చేసేందుకు వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories