ఐదు కొత్త రెవెన్యూ డివిజనలు.. పరిపాలనలో మరో బలమైన అడుగు
జిల్లాలతో పాటు రెవెన్యూ వ్యవస్థలోనూ విస్తరణ అవసరమని మంత్రుల కమిటీ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ప్రకటించారు. వాటిలో
• నక్కపల్లి – అనకాపల్లి జిల్లా
• అద్దంకి – ప్రకాశం జిల్లా
• పీలేరు – మదనపల్లె కొత్త జిల్లా
• బనగానపల్లె – నంద్యాల జిల్లా
• మడకశిర – శ్రీ సత్యసాయి జిల్లా
ఈ డివిజన్లు ఏర్పడడంతో ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారం కావడం, సేవలు సమయానికి చేరడం, స్థానిక పరిపాలన బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.