అఖిల్, శ్రియల పెళ్లి కుదిర్చిన ఉపాసన

First Published Mar 4, 2017, 11:17 AM IST
Highlights
  • అఖిల్, శ్రియ భూపాల్ పెళ్లికి లైన్ క్లియర్
  • రంగంలోకి దిగి అంగీకారం కుదిర్చిన మెగా కోడలు
  • ఉపాసన ఒప్పించటంతో రాజీ కుదుర్చుకున్న అఖిల్, శ్రియ

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ ల వివాహం రద్దయినట్లు ఇటీవల ప్రపంచమంతా కోడై కూసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాహం రద్దు కాకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని తెలుస్తోంది. అఖిల్ వివాహం రద్దు కావడంపట్ల నాగార్జున తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. స్వయంగా నాగార్జున ప్రయత్నించినా... శ్రియా భూపాల్ అంగీకరించక పోవడంతో... ఇద్దరి మధ్య రాజీ కుదరలేదని తెలిసింది.

 

అయితే తాజాగా అఖిల్, శ్రియాల పెళ్లి జరిపేందుకు నాగార్జున కుటుంబానికి ఓ మెగా ఫ్యామిలీ మెంబర్ నడుం బిగించారని, ఆ ప్రయత్నం ఫలించి మళ్లీ అంతా సవ్యంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తాజా సమాచారం. వివరాల్లోకెళ్తే... మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జునకు ఆప్తుల్లో ఒకరు. నాగార్జున మనస్థాపానికి గురి కావడం చూసి చలించిన చిరంజీవి ఎలాగైనా నాగార్జునకు బాధ నుంచి విముక్తి కలిగించాలని భావించారట. అందు కోసం శ్రియా భూపాల్ కుటుంబంతో బంధుత్వం ఉన్న మెగా కోడలు ఉపాసనను రంగంలోకి దించారట.

 

మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి శ్రియా భూపాల్ కు మంచి స్నేహితురాలు కూడా కావటంతో ఆపరేషన్ అఖిల్, శ్రియా వెడ్డింగ్ చేపట్టారని, ఇద్దరితో మాట్లాడి తను తెలివిగా... ఇరువురిని ఒప్పించిందని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఇక అఖిల్, శ్రియాల వివాహం జరగటం నల్లేరు మీద నడకేనని తెలుస్తోంది. మొత్తానికి ఈ వివాహం జరిగితేే మెగా కోడలు ఉపాసనకు నాగార్జున ఎంత థాంక్స్ చెప్తారో ఏమో కానీ ఇటు అక్కినేని అబిమానులు, అటు మెగా అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

click me!