
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ నేడు పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా తమ అన్యోన్య బంధాన్ని ప్రతిబింబించేలా ఓ అదిరిపోయే ఫోటోని పంచుకుని విషెస్ తెలిపారు చిరంజీవి. తాజాగా ఆమె కోడలు, రామ్చరణ్ భార్య ఉపాసన తన అత్తకి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. బర్త్ డే సందర్భంగా మర్చిపోలేని గిఫ్ట్ ప్లాన్ చేసింది. అది మామూలు కాదు, ఏకంగా కొత్త బిజినెస్నే ప్రారంభించడం విశేషం.
అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా చేస్తున్నారు. తన అత్త సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా `అత్తమ్మ కిచెన్` పేరుతో ఫుడ్ బిజినెస్ను ప్రారంభించారు ఉపాసన. సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించి.. అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు. చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ సిద్ధం చేస్తుండేవారు. కొణిదెల వంటకాలను "అత్తమ్మ కిచెన్" ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్లు ద్వారా వారి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఉపాసన కొణిదెల తన బిజినెస్ టెక్నిక్స్ ని ఉపయోగించుకుని, ఈ వెంచర్ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తతో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌరవాలను కూడా ప్రకటించేలా ఉంది. సంప్రదాయం, ప్రేమకు చిహ్నంగా "అత్తమ్మ కిచెన్"ని నిలబెట్టాలని ఉపాసన కాంక్షిస్తున్నారు. ఇంట్లో వండిన ఈ భోజనాన్ని, ఒక్కో వంటకం రుచిని అనుభవించమని అందరినీ ఆహ్వానిస్తున్నారు.
ఉపాసన ఇప్పటికే అపోలో ఫార్మసీ విభాగాన్ని చూస్తుంది. అలాగే చైల్డ్ కేర్ని ఇటీవలే ప్రారంభించింది. పేద చిన్న పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేసే కార్యక్రమాలు ప్రారంభించారు. మరోవైపు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే మెగావారింట్లో కోడలిగా, ఇల్లాలుగా, క్లీంకారకి తల్లిగా, వ్యాపారవేత్తగా ఇలా మల్టీఫుల్ వర్క్ చేస్తూ రాణిస్తుంది. ఎంతో మంది మహిళలకు ఆదర్శనంగా నిలుస్తుంది ఉపాసన.
Read more: భార్య సురేఖకి చిరంజీవి బర్త్ డే విషెస్.. ఆయన కవిత్వ, ప్రాసలు చూస్తే మతిపోవాల్సిందే.. పోస్ట్ వైరల్