మన పెళ్లికి ఎప్పుడో ఓకే చెప్పేశా.. ఛార్మికి త్రిష సమాధానం!

By AN TeluguFirst Published May 6, 2019, 11:38 AM IST
Highlights

కోలీవుడ్ బ్యూటీ త్రిష శనివారం నాడు 37వ పుట్టినరోజు జరుపుకొన్న సంగతి తెలిసిందే.

కోలీవుడ్ బ్యూటీ త్రిష శనివారం నాడు 37వ పుట్టినరోజు జరుపుకొన్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు, ఆమె సన్నిహితులు సోషల్ మీడియావేదికగా త్రిషకి శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలో హీరోయిన్ ఛార్మి కూడా త్రిషకి విషెస్ చెప్పింది.

అలానే త్రిషకి ప్రపోజ్ కూడా చేసింది. ఇప్పుడు అంతా చట్టబద్ధం.. మనం పెళ్లి చేసుకుందామా..? అంటూ త్రిషని అడిగింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మీమ్స్ కూడా చేశారు. తాజాగా తనకు విషెస్ చెప్పిన వారందరికీ పేరు పేరునా రీట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసింది త్రిష.

ఈ నేపధ్యంలో ఛార్మి ట్వీట్ కి కూడా రిప్లయ్ ఇచ్చింది. ''విషెస్ చెప్పినందుకు థాంక్స్.. మన పెళ్లిపై నేనెప్పుడో ఓకే చెప్పేశా..'' అంటూ కొంటెగా సమాధానమిచింది. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్లు హాట్ టాపిక్ గా మారాయి. 

''మనం పెళ్లి చేసుకుందాం,చట్టబద్దం'' త్రిషకు ఛార్మి ప్రపోజల్

click me!