విజయ్ దేవరకొండ కోసం క్యూలో నిర్మాతలు!

By AN TeluguFirst Published May 20, 2019, 2:07 PM IST
Highlights

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడితో సినిమాలు తీయడానికి టాలీవుడ్ అగ్ర ప్రొడ్యూసర్లందరూ ఇప్పుడు క్యూ కడుతున్నారు.

ఒకప్పుడు గీతాఆర్ట్స్ సంస్థ మెగాహీరోలతో తప్ప బయట హీరోలతో సినిమాలు తీసేది కాదు.. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన విజయ్ దేవరకొండని హీరోగా పెట్టి రెండు సినిమాలు తీసింది. అవే 'గీత గోవిందం', 'టాక్సీవాలా'. ఈ రెండు సినిమాలు గీతాఆర్ట్స్ కి మంచి లాభాలను తీసుకొచ్చాయి.

దీంతో విజయ్ తో మరో సినిమా కూడా తీయాలని ప్లాన్ చేసింది గీతాఆర్ట్స్ నిర్మాణ సంస్థ. కానీ విజయ్ కి వేరే కమిట్మెంట్లు ఉండడంతో సినిమా చేయడం కుదరలేదు. 'టాక్సీవాలా' తరువాత విజయ్ ని హీరోగా పెట్టి 'డియర్ కామ్రేడ్' సినిమా తీస్తుంది మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర సంస్థ. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాతో భారీగా లాభాలు చేసుకుంటున్న మైత్రి సంస్థ కూడా విజయ్ తో మరో సినిమా చేయడానికి సిద్ధమైంది. దర్శకుడు ఆనంద్ అన్నామలై అనే కొత్త దర్శకుడితో విజయ్ ప్రాజెక్ట్ సెట్ చేసింది. 'హీరో' అనే టైటిల్ తో ఇటీవల ఈ సినిమాను ప్రారంభించారు.

అలానే వైజయంతి మూవీస్ సంస్థ విజయ్ తో సినిమాలు చేయాలనుకుంటుంది. ఇప్పటికే ఆ సంస్థతో కలిసి పని చేయడానికి  విజయ్ కమిట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద బ్యానర్లన్నీ కూడా విజయ్ దొరికితే విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో మరే హీరోకి ఇంత క్రేజ్ లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు!

click me!