అజయ్దేవ్గన్ దర్శకత్వంలో వస్తున్న నాలుగో సినిమా భోళా. ఎవరది.. ఆగని శక్తి వస్తోంది.. అంటూ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు అజయ్ దేవ్గన్. 3డీ ఫార్మాట్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ (Ajay Devgn) మరో రీమేక్ లో చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన దృశ్యం 2 చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ తో భాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ ఊపులో తనే స్వయంగా దర్శకత్వం వహిస్తూ.. లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం భోళా (Bholaa) టీజర్ వదిలారు. కార్తీ టైటిల్ రోల్లో మెరిసిన ఖైదీ చిత్రానికి అఫీషియల్ హిందీ రీమేక్గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని చేస్తే లోకేష్ కనకరాజ్ డైరక్ట్ చేయాలని ఎవరూ ధైర్యం చేయలేదు. కానీ అజయ్ దేవగన్ ఈ ప్రాజెక్టు చేపట్టి ముందుకు వెల్తున్నారు.
అజయ్దేవ్గన్ దర్శకత్వంలో వస్తున్న నాలుగో సినిమా భోళా. ఎవరది.. ఆగని శక్తి వస్తోంది.. అంటూ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు అజయ్ దేవ్గన్. 3డీ ఫార్మాట్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని2023 మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. 800 కోట్లు కుంభకోణంలో జైలు శిక్ష పడిన వ్యక్తిగా అజయ్ ఇందులో కనిపిస్తారు. తమిళంతో పోలిస్తే హిందీలో కథ, క్యారెక్టర్స్లో చాలా మార్పులు చేస్తూ భోళా రీమేక్ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో అమలాపాల్ అతిథి పాత్రలో నటించనున్నది. భోళాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా కథాగమనంలో కీలకంగా ఉంటుందని సమాచారం. క్యారెక్టర్ నచ్చడంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. అజయ్ దేవ్గన్ ఫిలిమ్స్, టీ-సిరీస్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతుంది. అజయ్దేవ్గన్ – శ్రియా కాంబినేషన్లో తెరకెక్కిన దృశ్యం 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా మొదటి రోజు నుంచి మంచి టాక్తో స్క్రీనింగ్ అవుతుంది.