సురేష్ బాబుకు అప్పుడే అర్దమైందా

First Published Sep 9, 2017, 8:42 AM IST
Highlights
  • టాలీవుడ్ లో టాలెంట్ ప్రోడ్యుస‌ర్ సురేష్ బాబు 
  • డైరెక్ట‌ర్ క‌థ చెప్ప‌గానే హిట్ ఆ ఫ‌ట్ ఆ అని ఇట్టె ప‌సిగ‌ట్టెస్తాడు
  • నాగ‌చైత‌న్య యుద్దం శ‌ర‌ణం మూవీ కి మొద‌ట నిర్మాత సురేష్ బాబునే
  • త‌రువాత తెలివిగా పక్క‌కు త‌ప్పించుకున్న‌డ‌ని టాక్ వినిపిస్తోంది

 

నిజానికి టాలీవుడ్ మొత్తం మీద నెంబ‌ర్ వ‌న్ బిజినెస్ మ్యాన్ ఎవ‌రు అంటే అంద‌రు సురేష్ బాబు పేరునే చెబుతారు..ఎందుకంటే ఆయ‌న ప్ర‌తిపైసా చూస్కోని ఖ‌ర్చు చేస్తుంటాడు. డైరెక్ట‌ర్ క‌థ చెప్ప‌గానే హిట్ ఆ ఫ‌ట్ ఆ అని ఇట్టె ప‌సిగ‌ట్టెస్తాడు.  కట్ థ్రోట్ బిజినెస్ మన్ ఎవరు అని అంటే దగ్గుబాటి సురేష్ బాబు పేరు ఒక్కటే వినిపిస్తుంది. పది కోట్లు పెట్టుబడి పెడితే ఒక్క రూపాయి లాభం వస్తుందన్నా, ఆయన వదలరు. అదే పది కోట్లు పెట్టుబడి పెడితే ఒక్క రూపాయి తగ్గుతుంది అన్నా ఆ ప్రాజెక్టును ముట్టరు. 

యుద్ధం శరణం సినిమా డైరక్టర్ చైతూ క్లాస్ మేట్. ఈ సినిమా సబ్జెక్ట్ తో ఆయన సురేష్ క్యాంప్ లో చిరకాలం వున్నారు. సినిమా ఆఖరికి ఫైనల్ అనుకున్నారు. కానీ తెలివిగా బాల్ వెళ్లి వెళ్లి సాయి కొర్రపాటి కోర్టులో పడింది. అదే సమయంలో సురేష్ బాబు నిర్మాతగా లేకుండా నేనే రాజు నేనే మంత్రి స్టార్ట్ అయింది. కొంత షూట్ జరిగిన తరువాత సురేష్ బాబు నిర్మాతగా అందులోకి చేరారు. ఆయన అంచనాలు అలా వుంటాయి మరి. 

యుద్ధం శరణం విడుదలయిన తరువాత తెలిసింది, దర్శకుడు కృష్ణ స్టామినా ఏమిటో? అది ముందుగానే పసిగట్టేసి వుంటారు దగ్గుబాటి సురేష్ బాబు. అందుకే ఆయన గట్టోడు అనుకోవాల్సిందే.

click me!