పవన్ కళ్యాణ్ ను కలవనున్న శ్రీమతి సురేఖ చిరంజీవి

Published : Jan 04, 2017, 02:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
పవన్ కళ్యాణ్ ను కలవనున్న శ్రీమతి సురేఖ చిరంజీవి

సారాంశం

మెగా స్టార్ ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ వస్తాడా రాడననే సందిగ్దత పవన్ ను కలిసి ఆహ్వానించాలని శ్రీమతి సురేఖ భావిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించి బాధ్యత ఆయనకే వదిలేసిన రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ ఎత్తున నిర్వహించ తలపెట్టిన మెగా ఈవెంట్ ఖైదీ నెంబర్ 15-0 ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అనే సందిగ్దత నెలకొని ఉంది. ఇటీవల కాలంలో జరిగిన ఏ మెగా ఈవెంట్ కు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. అయితే అన్నయ్య దశాబ్ద కాలం తర్వాత తిరిగి సిల్వర్ స్క్రీన్ పైకి వస్తుండటంతో ప్రమోషన్ గ్రాండ్ గా నిర్వహించాలనుకుంటున్న మెగా ఫ్యామిలీ... ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను ఈవెంట్ కు రప్పించాలని ప్లాన్ చేస్తోంది.

 

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రామ్ చరణ్ నేరుగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. అయితే పవన్ తప్పనిసరిగా ఈవెంట్ కు వస్తాడో లేదో అనుమానమైతే ఉంది. పవన్ రాకపై క్లారిటీ లేకపోవడంతో చిరంజీవి సతీమణి సురేఖ నేరుగా పవన్ ను ఆహ్వానించాలని భావిస్తున్నారట. ఇప్పటికే పవన్ కు వదినమ్మ ఫోన్ చేశారని తెలుస్తోంది. మరి పవన్ రాకపై క్లారిటీ మాత్రం దొరకట్లేదు. సడెన్ సర్ ప్రైజ్ ఇస్తారో లేక పవన్ డుమ్మా కొడతారో ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకా ఆగాల్సిందే.

PREV
click me!

Recommended Stories

పెళ్లైన మూడు నెలలకే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..?
పెళ్లికి ముందే కోట్లు వదిలించుకున్న రష్మిక మందన్న, ట్యాక్స్ ఎంత కట్టిందో తెలుసా?