ఎన్టీఆర్ ఫుడ్ సీక్రెట్ బయటపెట్టిన మహేష్ బాబు! అలా అన్నావేంటి బ్రో

By Mahesh JujjuriFirst Published Oct 2, 2024, 9:40 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? 

యంట్ టైగర్ ఎన్టీఆర్.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరికి మరోకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటుంటారు. మహేష్ బాబు ఇతర హీరోలతో పెద్దగా కలవడం.. పార్టీలు చేసుకోవడం లాంటివి చేయరు. కాని ఎన్టీఆర్, చరణ్, బన్నీ, ప్రభాస్ లాంటివారు మాత్రం పార్టీలు, బ్యాచిలర్ ఈవెంట్లు వంటివి ఎక్కువగా చేసుకుంటుంటారు. 

కాని మహేష్ బాబు ను కలిసినప్పుడు మాత్రం చాలా మర్యాధగా మాట్లాడుకుంటుంటారు. అంత కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లు అర్జన్ ను బావా అంటూ రామ్ చరణ్ ను బ్రదర్ అంటూ.. చాలా క్లోజ్ గా పిలుస్తుంటాడు. మహేష్ బాబు అన్నా అని సంబోధిస్తుంటాడు తారక్. ఈక్రమంలోనే వీరిద్దరు ఓ ప్రోగ్రామ్ లో కలుసుకున్నారు. 

Latest Videos

గతంలో ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు అనే ప్రోగ్రామ్ కు హోస్టింగ్ చేశారు. ఈ షోకు చాలామంది సెలబ్రిటీలు వచ్చి ఆడారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య ఫుడ్ కు సభందించిన విషయం చర్చకు వచ్చింది. ఇక ఈ ఇద్దరికి ఒకరి తిండి గురించి మరొకరికి తెలుసు. అందులోను ఎన్టీఆర్ ఇష్టంగా తినే కొన్ని పదార్ధాను మహేష్ గుర్తు పెట్టుకుని మరీ ప్రస్తావించాడు. 

పవన్ కళ్యాణ్ దీక్ష పై ప్రకాశ్ రాజ్ కు ఎందుకు మంట, పూనం కౌర్ బాధేంటో.. ?

ఫుడ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మహేష్ బాబు ఎన్టీఆర్ నుఉద్దేశించి ఇలా అన్నారు. నీ తిండి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడంటే ఇలా ఉన్నావు కాని.. నువ్వు అప్పుడు ఎలా తినేవాడివో నాకు తెలుసు.. ఆ రోజులు నాకు కూడా గుర్తున్నాయి అని అన్నారు. అప్పుడే తారక్.. వద్దు అన్నా నేను ఎలా తినేవాడితో మాత్రం చెప్పొద్దు అన్నారు. 

అప్పుడు మహేష్ బాబు చెపుతూ... ఇడ్లీని అలా నెయ్యిలో ముంచుకుని. తీసి చెట్నీతో తినేవాడివి.. అంటే చెపుతుంటేనే.. తారక్ కలగచేసుకుని.. అవునన్నా చాలా బాగుంటుంది. నువ్వు కూడా ట్రై చేయాలన్నా.. అలా. నికు నేను వారం రోజులు అలా తినిపిస్తాను.. ఆతరువాత ఎలా ఉంటావో చూడు.. బుగ్గరు రౌండ్ గా.. తయారయ్యి బాగా ఉంటావు అంటూ తారక్ కామెడీగా కౌంటర్ కూడా ఇచ్చారు. ఈవీడియో వైరల్ అవుతోంది. 

జూనియర్ ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు. 

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొంత మెయింటేన్ చేయాలి కాబట్టి కంట్రోల్ లో ఉంచుకుంటున్నాడు కాని.. తారక్ మంచి భోజన ప్రియుడు ఆయన చాలా సందర్భాల్లో తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకొచ్చారు.  తనకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటో చెపుతూనే ఎలా తింటాడు అనేది కూడా చెప్పారు. ఆయనకు  ఇది ఇష్టమని చెప్పడం వేరు, అది ఎలా వండాలి...ఎలా తినాలో కూడా చెప్పడంలో తారక్ తరువాతే ఎవరైనా. 

ఇంతకీ ఎన్టీఆర్ కు చాా ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా.. తనకు నాటుకోడి అంటే ఇష్టమని చెప్పాడు. అయితే చికెన్‌ కర్రీలా తినడం కాదు, ఏకంగా కోడి మొత్తాన్ని తినడం ఇష్టమట. నాటుకోడిని క్లీన్‌ చేసి,ఆ కోడి మొత్తాన్ని కాల్చి, దానికి చుట్టూ కారం, అల్లం వెల్లుల్లి ముద్దని దట్టించి, కాసేపు అలా ఉంచి, దానికి కాస్త నెయ్యి, పెరుగు, పసుపు పట్టించి.. మంచి మంటమీద కాల్చి.. తందూరిలా చేసి.. రోటీతో తో తినడం చాలా ఇష్టమట.  ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తారక్ వెళ్ళడించారు. 

దేవర తో అలరించిన ఎన్టీఆర్

ఇక ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. సోలో హీరోగా దాదాపు 6 ఏళ్ళ తరువాత ఫ్యాన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ తో మూడేళ్ళ క్రితం ఆస్కార్ రేంజ్ కు వెళ్ళాడు. ఇక దేవర సినిమాలో గత నాలుగు రోజులుగా రచ్చ చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. అయితే ఈమూవీపై నెగెటీవ్ కామెంట్స్ కూడా వస్తుండటం గమనార్హం. 

దేవర లాంగ్ రన్ లో అనకున్న కలెక్షన్స్ ను సాధిస్తుందా లేదా అనేది అనుమానం. కొరటాల శివ డైరెక్షన్ లో  తెరకెక్కిన ఈసినిమాను ఎన్టీఆర్ అన్న ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇక ఈసినిమాలో జూనియర్ జతగా బాలీవుడ్ ముద్దు గుమ్య జాన్వీ కపూర్ నటించి మెప్పించింది. అయతే ఆమె ఈసినిమాలో ఒక్క పాటలో తప్పించి. సినిమాలో పెద్దగా యాక్టింగ్ స్కోప్ లేదని చెప్పవచ్చు. 

1 నిమిషానికి 5 కోట్లు.. నయనతార రెమ్యునరేషన్ కు ఫ్యూజ్ లు ఎగిరిపోవాల్సిందే..?

ఇక తారక్ నెక్ట్స్ ప్రశాంత్ నీల్ తో సినిమాకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తో చాలా కాలం క్రితమే సినిమాను ప్రకటించాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు ఆసినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక అటు బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ తో కలసి వార్ సినిమాలో కూడా నటించాడు తారక్. 

మహేష్ బాబు ఫుడ్ సీక్రేట్.. 

ఇటు మహేష్ బాబు  కూడా తన ఫుడ్ హ్యాబిడ్స్ గురించి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆయన బాగా ఇష్టంగా ఏం తింటారు అంటే.. అని అడిగితే.. పలు ఇంటర్వ్యూల్లో ఇలా అన్నారు. నేను అన్నిరకాలుగా తింటాను. కాని మితంగాతింటారను ఏది అతిగా తినను. ఇష్టం కదా అని పోలోమని నోట్లో కుక్కేసుకోవడం అలవాటు లేదు అందుకే ఇంత ఫిడ్ గా ఉన్నాను అన్నారు మహేష్. 

మితంగా అంటే ఎంత అని యాంకర్ అడగ్గా.. అందరు తిన్నట్టే పూరి ఇష్టంగా తింటాను.. కాని ఓ డజను... లేక పది పూరీలు తినడం కాదు.. రెండు మూడు కంటే ఎక్కువ తినను అలానే బిర్యాని కూడా తింటాను.. కాని మితంగా తింటాను అన్నారు. అంతే కాదు మహేష్ బాబు డైరీ ప్రాడెక్ట్స్ ఏవీ వాడరట. అంటే పాలు, పెరుగు,నెయ్యి, చీజ్, పన్నీర్ ఇలా దానికి సబంధించిన ఏదీ ఆయన తినరట. ఈ విషయాన్ని సుమతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ వెళ్ళడించారు. 

ఇక ప్రస్తుతం రాజమౌళిసినిమా కోసం రెడీ అవుతున్నాడు మహేష్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యింది. ఇక సినిమా ఓపెనింగ్ ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఈసినిమా కోసం మహేష్ బాబు కంప్లీట్ గా తన గెటప్ ను మార్చేసుకున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో గెటప్ ను చేంజ్ చేశాడు. లాంట్ హెయిర్ తో పాటు.. గెడ్డం పెంచుకుని డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు మహేష్. 

click me!