సాయి పల్లవి డిమాండ్... రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తేనే షూటింగ్?

By Prashanth MFirst Published Nov 20, 2018, 5:14 PM IST
Highlights

ఫిదా సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న బ్యూటీ సాయి పల్లవి. ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా ఈ బ్యూటీ తనదైన శైలిలో ఆడియెన్స్ ను తనవైపుకు తిప్పుకుంది.

ఫిదా సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న బ్యూటీ సాయి పల్లవి. ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా ఈ బ్యూటీ తనదైన శైలిలో ఆడియెన్స్ ను తనవైపుకు తిప్పుకుంది. అయితే అప్పుడపుడు ఈ క్యూట్ గర్ల్ పై ఊహించని రూమర్స్ కూడా వస్తున్నాయి. గతంలో MCA సినిమా చేస్తున్నపుడు షూటింగ్ లకు లెట్ గా వచ్చి చిత్ర యూనిట్ సబ్యులకు ఆగ్రహం తెప్పించిందని టాక్ వచ్చింది. 

ఆ తరువాత నిర్మాత దిల్ రాజు ఆ రూమర్స్ అబద్దమని ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు రీ షూట్ కోసం అని అడిగితే రెమ్యునరేష్ ఎక్కువగా ఇస్తేనే చేస్తానని డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టమని డైరెక్ట్ గా డిమాండ్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం శర్వానంద్ తో అమ్మడు పడి పడి లేచే మనసు అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. 

హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలనీ నిర్మాతలు డిసైడ్ అయ్యారు. అయితే సాయి పల్లవి పారితోషికం ఎక్కువగా అడిగినప్పటికీ నిర్మాతలు ఒప్పుకొని మరి సీన్స్ ను రీ షూట్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా వెలువడలేదు. క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ విలైనంత త్వరగా వివరణ ఇస్తే బావుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

click me!
Last Updated Nov 20, 2018, 5:14 PM IST
click me!