షూటింగ్ లో స్పృహ తప్పిపడిపోయిన త్రిష!

By AN TeluguFirst Published May 2, 2019, 10:51 AM IST
Highlights

నటి త్రిష ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. ఇటీవల ఆమె నటించిన '96', 'పేట' సినిమాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి.

నటి త్రిష ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. ఇటీవల ఆమె నటించిన '96', 'పేట' సినిమాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. మధ్యలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి సక్సెస్ అందుకోవాలని ప్రయత్నించినా.. వర్కవుట్ కాలేదు.

అయినా తను మాత్రం ఆ జోనర్ ని విడిచిపెట్టేదే లేదంటోంది ఈ చెన్నై సుందరి. తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. దీనికి దర్శకుడు మురుగదాస్ కథ, మాటలు అందిస్తున్నారు. శరవణన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి రాంగీ అనే టైటిల్ ని నిర్ణయించారు.

ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న త్రిష సడెన్ గా స్పృహ తప్పి పడిపోయిందని, వెంటనే ఆమెను సమీపంలోని హాస్పిటల్ లో చేర్పించినట్లు, ప్రస్తుతం ఆమెకి చికిత్స  పొందుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో త్రిష అభిమానులు ఆందోళన చెందుతూ ఆమెకి ఎలా ఉందా అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

దీంతో త్రిష తల్లి ఉమాక్రిష్ణన్ స్పందించి.. త్రిషకి ఎలాంటి సమస్య లేదని, తను ఆరోగ్యంగా ఉందని తెలిపింది. 'రాంగీ' సినిమా షూటింగ్ లో విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్ళు పాల్గొంటున్నట్లు తెలిపారు. 

click me!