బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్!

By Prashanth MFirst Published May 6, 2019, 7:34 PM IST
Highlights

బాలీవుడ్ మాస్ ఎంటర్టైనర్ సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి మరో పోలీస్ డ్రామా కథతో సిద్దమయ్యాడు. సౌత్ సినిమా కథలను బాలీవుడ్ జనాల అభిరుచుకి తగ్గట్టుగా తెరకెక్కించడంలో ఈ దర్శకుడు చాలా తెలివిగా ఆలోచిస్తాడు. 

బాలీవుడ్ మాస్ ఎంటర్టైనర్ సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి మరో పోలీస్ డ్రామా కథతో సిద్దమయ్యాడు. సౌత్ సినిమా కథలను బాలీవుడ్ జనాల అభిరుచుకి తగ్గట్టుగా తెరకెక్కించడంలో ఈ దర్శకుడు చాలా తెలివిగా ఆలోచిస్తాడు. సూర్య సింగం రీమేక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్టందుకున్న రోహిత్ ఇటీవల టెంపర్ ను సింబా గా రీమేక్ చేసి మరో హిట్ అందుకున్నాడు. 

ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ తో అదే తరహాలో ఒక పోలీస్ కథను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.  బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తోన్నసూర్యవన్షి అనే ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. అజయ్ దేవగన్ - రణ్ వీర్ సింగ్ అతిధి పాత్రల్లో కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ముందే క్లారిటీ ఇచ్చింది. 

ఇక త్వరలో సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నట్లు దర్శకుడు నిర్మాత అధికారికంగా తెలియజేశారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి కొన్ని పాటలను అందించనున్నాడు. హరీస్ జయరాజ్ - తనిష్క్ - లీజో వంటి వారు కూడా సినిమాకు సంగీతం అందించనున్నారు.

click me!