
సాయిధరమ్తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘విన్నర్’ చిత్రం ఫారిన్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బేబి భవ్య సమర్పిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్సింగ్ నాయిక. ఇటీవలే ఈ చిత్రం ఫారిన్ షెడ్యూల్ పూర్తయింది.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘షూటింగ్ అంతా ముందుగా అనుకున్న ప్రకారం సాగుతోంది. నవంబర్ 3 నుంచి 20 వరకు ఉక్రెయిన్లో పాటల్ని తీశాం. సాయిధరమ్తేజ్, రకుల్ ప్రీత్సింగ్ మీద రెండు పాటల్ని, సాయిధరమ్తేజ్, యాంకర్ అనసూయ మీద ఒక పాటను చిత్రీకరించాం.
టర్కీలోని ఇస్తాంబుల్లో క్లైమాక్స్కి సంబంధించిన యాక్షన్ పార్ట్ను చిత్రీకరించాం. బల్గేరియన్ ఫైట్ మాస్టర్ కలయాన్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించాం. ‘బాహుబలి’లో మంచు కొండల్లో జరిగే యాక్షన్ ఎపిసోడ్ను రూపకల్పన చేసింది కూడా కలయాన్.
డిసెంబర్ 6 నుంచి 22 రోజుల పాటు ఊటీ, బెంగుళూరులో షెడ్యూల్ జరుగుతుంది. అక్కడ కీలకమైన టాకీ, యాక్షన్ పార్టును తెరకెక్కిస్తాం. జనవరిలో బ్యాలన్స్ టాకీ, రెండు పాటలను చిత్రీకరిస్తాం. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది.
మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తాం. సినిమాలోని ప్రతి ఫ్రేమూ గ్రాండ్గా ఉంటుంది. సాయిధరమ్తేజ్, రకుల్ ప్రీత్సింగ్ జంట చక్కగా కుదిరింది. తమన్ మంచి బాణీలనిస్తున్నారు. అబ్బూరి రవి, శ్రీధర్ సీపాన రచన ఆకట్టుకుంటుంది. వెలిగొండ శ్రీనివాస్ మంచి కథనిచ్చారు’’ అని అన్నారు.