రవితేజ జోరు మామూలుగా లేదుగా.. మరో మాస్‌ ఎంటర్‌టైనర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌..

By Aithagoni RajuFirst Published Feb 21, 2021, 7:22 PM IST
Highlights

ప్రస్తుతం ఆయన రమేష్‌ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ వీడియోలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆదివారం మరో సినిమాని ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిపారు రవితేజ.

వరుస ఫ్లాప్‌ల్లో ఉన్న మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల `క్రాక్‌` సినిమాతో విజయాన్ని అందుకున్నారు. దీంతో పూర్వ వైభవాన్ని పొందాడు. ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. దీంతో వరుసగా సినిమాలను ఓకే చెబుతున్నాడు. ప్రస్తుతం ఆయన రమేష్‌ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ వీడియోలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆదివారం మరో సినిమాని ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిపారు రవితేజ.

త్రినాథరావు నక్కినతో రవితేజ సినిమా చేయబోతున్నట్టు గతంలోనే వార్తలు వినిపించాయి. కానీ దానిపై రవితేజగానీ, దర్శకుడు త్రినాథరావు నక్కిన గానీ స్పందించలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి తన ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తూ రవితేజ ఈ సినిమాని ప్రకటించాడు. తన 68వ చిత్రంగా ఇది రూపొందనుంది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం సాగుతుందని, దీన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్‌, వివేక్‌ కూచిభోట్ల నిర్మించనున్నారు.  కుమార్‌ బెజవాడ దీనికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 

We are happy to announce that we will be teaming up with Mass Maharaja & for a mass entertainer 🔥

Story & Screenplay:

More details soon!! pic.twitter.com/P5jGt4wSLf

— Vivek Kuchibhotla (@vivekkuchibotla)

ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. త్రినాథరావు నక్కిన గతంలో `సినిమా చూపిస్త మావ`, `నేనులోకల్‌`, `హలో గురు ప్రేమకోసమే` చిత్రాలను రూపొందించిన విషయం తెలిసిందే. 

click me!