తిరుమలలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు

First Published Dec 4, 2017, 12:58 PM IST
Highlights
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్,ఉపాసన దంపతులు
  • త్వరలో ప్రారంభం కానున్న సైరా సినిమా కోసం మొక్కులు
  • టాలీవుడ్ క్రేజీ జంటను చూసేందుకు ఎగబడ్డ తిరుమల భక్తులు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీనటుడు రాంచరణ్‌, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి ప్రసాదం తీసుకున్నారు. ఆలయం ఎదుట రామ్‌చరణ్‌ను చూసేందుకు భక్తులు, అభిమానులు పోటీపడ్డారు.

click me!