తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీనటుడు రాంచరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి ప్రసాదం తీసుకున్నారు. ఆలయం ఎదుట రామ్చరణ్ను చూసేందుకు భక్తులు, అభిమానులు పోటీపడ్డారు.