మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన రామ్‌చరణ్‌.. ?

By Aithagoni RajuFirst Published Dec 26, 2022, 8:10 PM IST
Highlights

ఇటీవల బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు రామ్‌చరణ్‌. ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఈ ప్రాజెక్ట్ హాట్‌ టాపిక్‌ అవుతుంది.

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే శంకర్‌తో `ఆర్‌సీ15` సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో ఈ సినిమా రూపొందుతుంది. దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్‌, అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో సీఎంగా, మరో పాత్రలో ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తున్నారని తెలుస్తుంది. 

దీంతోపాటు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. `ఆర్‌సీ16` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. త్వరలోనే ఇది అధికారికంగా ప్రారంభించనున్నారు. దీంతోపాటు తాజాగా మరో సినిమాకి సైన్‌ చేశారట రామ్‌చరణ్‌. కన్నడ దర్శకుడితో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. 

కన్నడలో మఫ్టీ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాని రూపొందించిన నర్తన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారట. ఓ భారీ యాక్షన్‌ మూవీకి ప్లాన్‌ చేస్తున్నారట. యూవీ క్రియేషన్స్ సంస్థ దీన్ని నిర్మించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. స్క్రిప్ట్ ఫైనల్‌ అయ్యాక దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే గతంలోనే ఈ సినిమా చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది ఓ కొలిక్కి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే నర్తన్‌ గతంలో యష్‌ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్ట్ వర్కౌట్‌ కాలేదని తెలుస్తుంది. అందుకే అదే కథని రామ్‌చరణ్‌కి చెప్పగా, ఆయన సుముఖంగా ఉన్నారని, ప్రస్తుతం డిస్కషన్‌ దశలో ఉందని త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్‌ రిజెక్ట్ చేసిన కథతో బుచ్చిబాబు సినిమా చేస్తున్నారు రామ్‌చరణ్‌. ఇప్పుడు యష్‌ రిజెక్ట్ చేసిన కథని చేయబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ గా మారింది. 

click me!