ధనుష్ - ఐశ్వర్యతో రజినీకాంత్ మీటింగ్.. మళ్లీ కలిసిపోవాలని సూచన.!

By team teluguFirst Published Oct 14, 2022, 6:45 PM IST
Highlights

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ - ఐశ్వర్య రజినీకాంత్ మళ్లీ కలువబోతున్నట్టు కోలీవుడ్ లో గట్టి ప్రచారం జరుగుతోంది. తాజాగా రజినీకాంత్ కూడా ఇద్దరీతో కలిసి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈసందర్భంగా పలు సూచనలూ చేశారంట. 
 

కోలీవుడ్ స్టార్ కపుల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళస్టార్ హీరో ధనుష్ (Dhanush) - ఐశ్వర్య  రజినీకాంత్ (Aishwarya Rajinikanth) వీడిపోయి సరిగ్గా 9 నెలల దాటింది. ఈ జంట అభిప్రాయ భేదాలతో విడిపోయిన విషయం తెలిసిందే. వీరి డివోర్స్ పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు కూడా చాలా అప్సెట్ అయ్యారు. మళ్లీ కలిస్తే బాగుండని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో అభిమానుల బలమైన కోరిక మరికొద్ది రోజుల్లో తీరబోతుందని తెలుస్తోంది. వీరిద్దరూ మళ్లీ కలుసుకోబుతున్నారని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగానే ప్రచారం జరుతోంది. 

ఇప్పటికే  రజినీకాంత్ కుటుంబ సభ్యులు, ధనుష్ కుటుంబ సభ్యులు కలిసి ధనుష్, ఐశ్వర్య జీవితంపై మరోసారి ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వారిద్దరికి యాత్ర, లింగ అనే ఇద్దరు పిల్లలు ఉండటంతో వారి కోసమైన మళ్లీ వీరిద్దరూ కలిసి జీవించాలని, జీవితంలో చిన్న చిన్న ఘర్షణలు, మనస్ఫార్థాలు సహజమేనని చెప్పి నచ్చజెప్పినట్టు సమాచారం. ఇక తాజాగా మరోసారి సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా కూతురు, అల్లుడితో మీటింగ్ ఏర్పాటు చేశారంట. 

 ఈ సందర్బంగా ధనుష్, ఐశ్వర్యకు రజినీకాంత్ పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. తాజాగా వారితో మాట్లాడుతూ విభేదాలను మరిచిపోయి కలిసిపోవాలని సూచించినట్టు సమాచారం. దీని పట్ల ధనుష్, ఐశ్వర్య కూడా పాజిటివ్ గానే స్పందించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఐశ్వర్య, ధనుష్ కలిసిపోవడానికి మరోసారి ప్రయత్నం చేయాలని రజినీకాంత్ ధనుష్ తండ్రి కస్తూరి రాజాను కోరారంట. కానీ తనకేమీ తెలియదంటూ స్పందించారంట. కానీ పిల్లలు ఇద్దరూ కలిసి ఉండాలనే కోరుకుంటున్నామని, వారు ఆనందంగా ఉంటేనే మేం సంతోషంగా ఉంటామని చెప్పారంట. 

ఇక 18 ఏండ్లుగా కలిసి జీవించిన ఈ జంట విడిపోవడటం అభిమానులకు ఏమాత్రంగా నచ్చడం లేదు. త్వరలోనే వీరు ఇద్దరు మళ్లీ ఒక్కటవ్వబోతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ధనుష్ మాత్రం డివోర్స్ తర్వాత వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. 

click me!