ఎంతటి "రాజ"మౌళి అయినా తండ్రితో దెబ్బలాడుతానంటాడా...

Published : Jan 25, 2017, 12:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఎంతటి "రాజ"మౌళి అయినా తండ్రితో దెబ్బలాడుతానంటాడా...

సారాంశం

తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన శ్రీవళ్లి ఆడియో వేడుకకు హాజరైన తనయుడు రాజమౌళి తండ్రితో దెబ్బలాడేందుకు ఎదురుచూస్తున్నాడట ఇంతకీ తండ్రితో రాజమౌళి ఎందుకు దెబ్బలాడాలనుకుంటున్నాడు

సింప్లిసిటీకి నిలువుటద్దంలా ఉండే దర్శకుడు జక్కన్న రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు రాజమౌళి. తెలుగు సినిమాలు కూడా జాతీయ,అంతర్జాతీయ స్థాయికి తీసిపోవని తన బాహుబలి సినిమా ద్వారా నిరూపించారు రాజమౌళి. అయినా సరే తాను తండ్రికి కొడుకును మాత్రమేనని సభాముఖంగా చాటి చెప్పే ప్రయత్నం చేశారు రాజమౌళి. హ్యాట్సాఫ్ టు జక్కన్న.

తండ్రి విజయేంద్ర ప్రసాద్ శ్రీవళ్లి సినిమా ఆడియో ఫంక్షన్ కు హాజరైన రాజమౌళి మాట్లాడుతూ "తాతగారు సంపాదించిన ఆస్తులన్నీ పోయిన తర్వాత పెదనాన్నగారు (శివశక్తి దత్తా), నాన్నగారు (విజయేంద్రప్రసాద్‌) ఘోస్ట్‌ రైటర్స్‌గా డబ్బులు సంపాదించేవారు. రైటర్స్‌గా వారి పేర్లు  ఎప్పుడు తెరపై పడతాయా? అని ఎదురు చూసేవాణ్ణి. చాలా సంవత్సరాల తర్వాత ‘జానకిరాముడు’ సినిమాకు వారి పేర్లు తెరపై పడ్డప్పుడు నాకు గర్వంగా అనిపించింది’’ అని అన్నారు. రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్‌ బృందావనం నిర్మించిన చిత్రం ‘శ్రీవల్లీ’. ఎం.ఎం. శ్రీలేఖ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని రాజమౌళి విడుదల చేసి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి ఇచ్చారు.

 

రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘రెండు వారాల గ్యాప్‌లో ‘బాహుబలి’, ‘భజరంగీ భాయ్‌జాన్‌’ వంటి హిట్స్‌ ఇచ్చిన రచయితగా నాన్నగారికి పేరు వచ్చినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. రైటర్‌గా నాన్న ఎంత గొప్పవారో తెలుసు. డైరెక్టర్‌గా సినిమాను అంత గొప్పగా తీసినప్పుడు కొడుకుగా గర్వపడతా. నా సినిమాల్లో నాన్న తప్పులు వెతుకుతుంటారు. ‘శ్రీవల్లీ’ విషయంలో కొడుకుగా గర్వపడ్డా, డైరెక్టర్‌గా నాన్నతో దెబ్బలాడే క్షణం కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘మా చిత్రంలో స్టార్ట్స్, డ్యాన్సులు, ఫైట్స్‌ లేకున్నా మంచి కథ, గ్రాఫిక్స్‌ ఉన్నాయి.

 

ఏ వ్యక్తీ పుట్టుకతో చెడ్డవాడు కాదు. పరిస్థితుల ప్రభావంతో మారతాడు. దానికి కారణం మనసే. ఆ మనసును మనం చూడగలిగితే మనలోని ఎన్నో సిండ్రోమ్స్, ఫోబియోలను దూరం చేయవచ్చు. మానవాళిని గొప్పగా మార్చవచ్చు అనే నేపథ్యంలో ఉంటుందీ చిత్రం. ఓ మంచి సినిమా చూశామనే తృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు విజయేంద్ర ప్రసాద్‌. దర్శకుడు కొరటాల శివ, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, శివశక్తి దత్తా, నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

The Raja Saab కథ లీక్‌ చేసిన ప్రభాస్‌, హైలైట్‌ ఇదే.. తాను పనిచేసిన డైరెక్టర్స్ గురించి క్రేజీ వర్డ్స్
Prabhas: పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన ప్రభాస్‌, ఎవరూ ఊహించరు.. `స్పిరిట్‌` లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌