విశాల్ సంగతేంటో తెలిసిపోయిందిగా.. రాధికా షాకింగ్ కామెంట్స్

By Prashanth MFirst Published May 14, 2019, 5:31 PM IST
Highlights

కోలీవుడ్ హీరో విశాల్ గత కొంత కాలంగా అనేక ఆరోణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నడిఘర్ సంఘం బాధ్యతలు వచ్చిన తరువాత విశాల్ స్థాయి ఎంతగా పెరిగిందో ఇప్పుడు అదే స్థాయిలో తగ్గిపోతోంది. సీనియర్ నటి రాధిక విశాల్ పై మరోసారి ఘాటైన కామెంట్స్ తో విరుచుకుపడ్డారు.

కోలీవుడ్ హీరో విశాల్ గత కొంత కాలంగా అనేక ఆరోణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నడిఘర్ సంఘం బాధ్యతలు వచ్చిన తరువాత విశాల్ స్థాయి ఎంతగా పెరిగిందో ఇప్పుడు అదే స్థాయిలో తగ్గిపోతోంది. సీనియర్ నటి రాధిక విశాల్ పై మరోసారి ఘాటైన కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. అతని సంగతేంటో తెలిసిపోయిందిగా.. అతను మంచివాడేమి కాదని ఆమె కౌంటర్ ఇచ్చారు. 

2015లో సినీ నిర్మాతల సమ్మతితో నడిఘర్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్ అంతకుముందు తన స్థానంలో ఉన్న సీనియర్ నటుడు శరత్ కుమార్ కు వ్యతిరేఖంగానే అడుగులు వేశాడు. మెయిన్ గా కమిటీకి సంబందించిన స్థలం విషయంలో అక్రమాలు జరిగాయని విశాల్ వర్గం అతనికి చుక్కలు చూపించింది. 

విషయం కోర్టు వరకు వెళ్లడంతో ఇద్దరి మధ్య తెరవెనుక యుద్ధం డోస్ పెరిగింది. ఇక ఇప్పుడు విశాల్ పదవి కాలం ముగియడంతో నెక్స్ట్ మరొకసారి నడిఘర్ సంఘం సీటు దక్కించుకోవాలని విశాల్ వర్గం ట్రై చేస్తోంది. మొదటి విశాల్ కి పోటీగా శరత్ కుమార్ సతీమణి రాధికా బరిలో దిగాలని అనుకున్నారు. అయితే తరువాత నిర్ణయం మార్చుకొని ఆ పదవి కోసం ఎగబడటానికి తమకు తీరిక లేదని కామెంట్ చేసిన రాధికా రీసెంట్ గా విశాల్ పై మరోసారి కామెంట్ చేశారు. 

విశాల్ అసలు స్వరూపం ఏమిటో ఇప్పుడిపుడే తెలుస్తోంది. అతను మంచి వాడు కాదని అందరికి అర్థమైపోయింది. ఇప్పటికైనా ఈ విషయం బయటపడినందుకు నాకు హ్యాపీగా ఉంది. విశాల్ కు వ్యతిరేఖంగా ఎవరు నామినేషన్ వేసినా వారికి మా పూర్తి మద్దతు ఇస్తామని రాధికా తెలిపారు.  

click me!