`పుష్ప2` రీ షూట్‌.. కీలక సీన్లు మళ్లీ తీస్తున్న సుకుమార్‌.. షాకింగ్‌ బడ్జెట్‌..?

By Aithagoni RajuFirst Published Jan 28, 2024, 10:38 AM IST
Highlights

సుకుమార్‌ అంటే సీన్లని చెక్కుతారని, ఓ భంగినా ఫైనల్‌ చేయడు అంటారు. అందుకే ఆయన సినిమాలు సంచలనాలుగా మారుతున్నాయి.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `పుష్ప2`. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న మూవీ ఇది. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. `పుష్ప` మూవీ పెద్ద విజయం సాధించడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో దర్శకుడు సుకుమార్‌ సైతం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. 

సుకుమార్‌ అంటే సీన్లని చెక్కుతారని, ఓ భంగినా ఫైనల్‌ చేయడు అంటారు. అందుకే ఆయన సినిమాలు సంచలనాలుగా మారుతున్నాయి. పైగా `పుష్ప 2` కోసం గ్లోబల్‌ ఆడియెన్స్ కూడా వెయిట్‌ చేస్తున్నారు. అందుకే రాజీపడటం లేదట సుకుమార్‌. సీన్లని చెక్కుతున్నాడని, ఏమాత్రం తేడా వచ్చినా మళ్లీ తీస్తున్నాడని అంటున్నారు. అయితే తాజాగా సుకుమార్‌ ఈ మూవీలోని కొన్ని సీన్లు మళ్లీ రీ షూట్‌ చేస్తున్నారట. 

Latest Videos

తాను అనుకున్నట్టుగా సీన్లు రాలేదని భావించి మళ్లీ షూట్‌ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీ షూటింగ్‌ డిలీ అవుతుందని అంటున్నారు. కానీ రిలీజ్‌ డేట్‌లో మార్పు లేదని ఇటీవల టీమ్‌ నుంచి క్లారిటీ వచ్చింది. ఎట్టకేలకు ఆగస్ట్ 15న విడుదల చేస్తామని ఫిక్స్ అయ్యారట. ఆ విషయంలో మార్పే లేదని అంటున్నారు. 

అయితే సినిమాకి బడ్జెట్‌ భారీగా పెరిగిపోతుందట. మొదట 250-300 కోట్ల వరకు అనుకున్నారట. కానీ ఇప్పుడు అదనంగా వంద కోట్లు అవుతుందట. 400కోట్లకి బడ్జెట్‌ వెళ్తుందని తెలుస్తుంది. ఇది టీమ్‌ని టెన్షన్‌ పెడుతుంది. అయితే సినిమా బాగుంటే ఇవన్నీ చల్తా, లేదంటే కొన్న బయ్యర్లు నిండా మునిగిపోతారు. నిర్మాతలకు థియేట్రికల్‌ రైట్స్, ఓటీటీ రైట్స్ రూపంలో భారీగానే వస్తుంది. కానీ కొన్ని బయ్యర్లకి మాత్రమే నష్టాలు వస్తాయి. అయితే సుకుమార్‌ సినిమా కాబట్టి కచ్చితంగా డిజప్పాయింట్‌ చేయదని అందరిలో ఉన్న నమ్మకం. మరి ఏంజరుగుతుంది? `పుష్ప2` ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 

click me!