బాలయ్య కొడుతుంటే అభిమానులు సంతోషపడతారు- పూరీ

First Published Aug 18, 2017, 9:45 AM IST
Highlights
  • పూరీజగన్ దర్శకత్వంలో బాలయ్య పైసా వసూల్
  • ఖమ్మంలో ఘనంగా పైసా వసూల్ ఆడియో వేడుక
  • వేడుకలో బాలయ్య కొట్టడమే అభిమానులకు సంతోషమన్న పూరీ

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పైసా వసూల్' మూవీ ఆడియో రిలీజ్ వేడుక ఖమ్మంలో గురువారం గ్రాండ్ గా జరిగింది. ఆడియో వేడుక మొదలవ్వగానే వర్షం మొదలైంది. అయినా వేడుక కొనసాగింది. అభిమానులు వేల సంఖ్యలో వచ్చి వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ స్పీచ్ ఆకట్టుకుంది. బాలయ్య అభిమానులపై చేయి చేసుకోవడం గురించి పూరీ తనదైన శైలిలో వెరైటీగా స్పందించారు.

 

ఈ సందర్భంగా పూరీ మాట్లాడుతూ... బాలయ్య బాబుపై అభిమానంతో వచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయలేదు. బాలయ్య బాబు ఎంత మొండోడో మీరూ అంతే మొండి అని నిరూపించారు. మీ అందరూ కాళ్లు ముందుకు పెడితే దండం పెట్టుకోవాలని ఉంది... అంటూ బాలయ్య అభిమానులను ఉద్దేశించి పూరి వ్యాఖ్యలు చేశారు. బాలయ్య బాబుతో పని చేసిన తర్వాత అసలు ఇంత లేటుగా ఎందుకు పని చేశానని, ఎప్పుడో చేయాల్సి వుందని బాధ పడ్డాను. అంత మంచి మనిషి బాలకృష్ణ గారు. ఆయన ముక్కుసూటి తనం తనకెంతో నచ్చుతుందన్నారు. బాలయ్య ప్రేమ వచ్చినా మొహం మీదే, కోపం వచ్చినా మొహం మీదే వెంటనే చెప్పేస్తారని పూరి వ్యాఖ్యానించారు.

 

బాలయ్య నాకు 101వ సినిమా అని చెప్పారు. ఆయన స్పీడు, దూకుడుకు చూస్తుంటే నాకు ఒకటో సినిమాలాగా అనిపించింది. ఆయనకు ఫైటర్లు కనిపిస్తే మీద పడిపోతారు, కారు ఇస్తే 360 డిగ్రీ రౌండ్ కొట్టేస్తారు, హీరోయిన్లను అమాంతం ఎత్తుకుని పరుగెడతారు. ఎన్నోసార్లు చెప్పాలనిపించింది మీ వయసు మోక్షజ్ఞ వయసు కాదు, కొంచెం ఎక్కువే అని. ఆయనతో పని చేయడం అమేజింగ్ అంటూ...బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తారు పూరి.

 

ఆయన నాతో ఎప్పుడు మాట్లాడినా రెండు విషయాలే మాట్లాడతారు. ఒకటి నాన్నగారు, రెండోది సినిమా. ఈ రెండు తప్ప ఏమీ మాట్లాడరు. తల్లి దండ్రులంటే ఇంత గౌరవం ఉన్న కొడుకును ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. అలాగే ఫోన్లో ఎప్పుడైనా మాట్లాడితే ఒకటి హిందూపూర్, రెండు కేన్సర్ హాస్పటల్ ఈ రెండిటి గురించే మాట్లాడతారు అని పూరి చెప్పుకొచ్చారు.

 

వేరే హీరోలు బయటకు వెళితే బౌన్సర్లు కావాలేమో? బాలయ్యకు అక్కర్లేదు. ఆయన ఫ్యాన్స్‌ను ఆయనే కంట్రోల్ చేసుకోగలరు. ఒక్కొక్కళ్లు మీద పడుతుంటే ఆయన కొడుతుంటారు. ఆలా కొట్టడం వాళ్లకు కూడా ఎంతో ఇష్టం. హ్యాపీగా ఫీలవుతుంటారు..... అని బాలయ్య అభిమానిపై చేసిన ఘటనను ఉద్దేశించి పూరి వ్యాఖ్యానించారు.

 

ఇవాళ మీడియాలో బాలయ్య బాబు ఎవరినో కొట్టాడని అంటున్నారు. అసలు మీడియా వారికి ఏం తెలుసు బాలయ్య కొట్టడాన్ని వాళ్లు ఎంత ఎంజాయ్ చేస్తారో? ఆయన ఎప్పుడైనా కొడితే కామన్ సెన్స్ అనే ఏరియా తేడా వస్తేనే కొడతారు. బాలయ్య బాబు ఎవరినైనా కొడితే గుర్తు పెట్టుకోండి అదో లవ్ స్టోరీ. డోంట్ టేక్ సీరియస్. పైసా వసూల్ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది....అని పూరి జగన్నాధ్ చెప్పుకొచ్చారు.

 

ఆయన ఎప్పుడు పిలిస్తే వెంటనే ఎగురు కుంటూ వెళ్లాలని ఉంటుంది. షూటింగ్ అయిపోయినప్పటి నుండి ఆయన లేక అందరికీ బోర్ కొడుతోందని పూరి వ్యాఖ్యానించారు. చివర్లో ‘కోకా కోలా పెప్సీ..... బాలయ్య బాబు సెక్సీ' అనే నినాదంతో పూరి తన ప్రసంగాన్ని ముగించారు.

 

click me!