సీఎం జగన్ పై దాడికి ముందే ఆ సీన్ తీశాం... జర్నలిస్ట్ మూర్తి కామెంట్స్ వైరల్

By Sambi ReddyFirst Published Apr 21, 2024, 1:27 PM IST
Highlights


జర్నలిస్ట్ మూర్తి ప్రతినిధి 2 మూవీతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 


నారా రోహిత్ హీరోగా టీవీ 5 జర్నలిస్టు మూర్తి దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం ప్రతినిధి 2. ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రతినిధి 2 అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్. ఏపీ సీఎం జగన్ టార్గెట్ గా తెరకెక్కించిన చిత్రమనే వాదన ఉంది. టీడీపీకి పొలిటికల్ మైలేజ్ ఇచ్చేందుకు రూపొందించిన చిత్రం అనడంలో సందేహం లేదు. నారా రోహిత్ చెప్పే డైలాగ్స్, ట్రైలర్ లో సన్నివేశాలు చంద్రబాబు గ్రేట్ అని పరోక్షంగా చెప్పేలా ఉన్నాయి. 

కాగా జర్నలిస్ట్ మూర్తి, నారా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ మంజూష ఒక ప్రశ్న లేవనెత్తారు. ప్రతినిధి చిత్రంలో హీరో నుదుటి మీద గాయం ఉంటుంది. ఆయన బ్యాండేజ్ తో కనిపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ పైన ఇటీవల దాడి జరిగింది. ఆయన నుదుటి మీద కూడా బ్యాండేజ్ కనిపిస్తుంది. జగన్ మీద రాయి దాడి ఘటన తర్వాత ఈ సీన్ తీశారా? అని ఆమె అడిగారు. 

దీనికి జర్నలిస్ట్ మూర్తి సమాధానం చెప్పాడు. అలాంటిది ఏమీ లేదు. సీఎం జగన్ మీద దాడి జరగక ముందే ఆ సన్నివేశాలు తీశాము. మా మూవీలో హీరో కుడి కన్ను మీద బ్యాండేజ్ ఉంటుంది. సీఎం జగన్ కి మాత్రం ఎడమ కన్ను మీద ఉంటుంది. మీరు టీజర్లో కూడా ఈ సన్నివేశం చూడవచ్చు. మేము సీఎం జగన్ పై జరిగిన దాడి స్పూర్తితో ఆ సన్నివేశాలు చేయలేదు. అంతకు ముందే తెరకెక్కించాము. నేను ఊహించలేదు అన్నారు. 

నారా రోహిత్, సిరి లేళ్ళ జంటగా నటించారు. హిట్స్ లేక సినిమాలు మానేసిన నారా రోహిత్ ప్రతినిధి 2 అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పలు పొలిటికల్ ప్రాపగాండా చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఒక్కటి కూడా ఆదరణ దక్కించుకోలేదు. 

click me!