కంటెస్టెంట్స్ ఎంపిక కూడా అయ్యాక బిగ్ బాస్ ఎందుకు ఆగిపోయింది? షాకింగ్ రీజన్!

By Sambi ReddyFirst Published Apr 21, 2024, 11:34 AM IST
Highlights

బిగ్ బాస్ లవర్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యాక షో ఆగిపోయింది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం 
 


బ్రిటన్ లో బిగ్ బ్రదర్ షో పేరుతో ఒక రియాలిటీ షో ప్రసారం అయ్యింది. ఈ షోలో శిల్పా శెట్టి పాల్గొంది. శిల్పా శెట్టి మీద జేన్ గూడి అనే మరో కంటెస్టెంట్ జాతి అహంకారపు కామెంట్స్ చేసింది. దాంతో జేన్ గూడి మీద ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇది శిల్పా శెట్టికి కలిసి వచ్చింది. ఆమె బిగ్ బ్రదర్ షో విన్నర్గ్ గా నిలిచింది. బిగ్ బ్రదర్ షో స్ఫూర్తితో ఇండియాలో బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యింది. ఫస్ట్ సీజన్ కి అర్షద్ వార్షి హోస్ట్ గా వ్యవహరించాడు. 

అనంతరం శిల్పా శెట్టి హోస్ట్ గా  చేసింది. కోన్ బనేగా కరోడ్ పతి షోతో పాప్యులర్ అయిన అమితాబ్ బచ్చన్ సైతం హోస్టింగ్ చేశాడు. అయితే సల్మాన్ ఖాన్ ఎంట్రీ  తర్వాత సినారియో పూర్తిగా మారిపోయింది. బిగ్ బాస్ హోస్ట్ అంటే సల్మాన్ ఖాన్ అన్నట్లు మారిపోయింది. 17 హిందీ సీజన్స్ ముగియగా పదికి పైగా సీజన్స్ కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేశాడు. 

కాగా బిగ్ బాస్ సక్సెస్ నేపథ్యంలో ఓటీటీ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే రెండు సీజన్స్ ప్రసారం అయ్యాయి. త్వరలో సీజన్ 3 స్టార్ట్ కావాల్సి ఉంది. అనూహ్యంగా ఈ సీజన్ రద్దు అయ్యింది. కంటెస్టెంట్ ఎంపిక కూడా పూర్తి అయ్యాక బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 స్టాప్ చేశారు. దీనికి బలమైన కారణం ఉంది. సల్మాన్ ఖాన్ కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇటీవల ఆయన ఇంటి వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకుంది. 

మోస్ట్ డేంజరస్ గ్యాంగ్ పేరు గాంచిన లారెన్స్ బిష్ణోయ్ ఈ కాల్పుల వెనుక ఉన్నాడని సమాచారం. దాంతో రిస్క్ తీసుకోవడం సరికాదని బిగ్ బాస్ ఓటీటీ ఆపేశారట. సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం . బిగ్ బాస్ లవర్స్ కి ఇది చేదు వార్త అని చెప్పొచ్చు.. 

click me!