ఏప్రిల్ 27 న సాహోగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ ప్ర‌భాస్‌

Published : Apr 09, 2017, 05:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ఏప్రిల్ 27 న సాహోగా  ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ ప్ర‌భాస్‌

సారాంశం

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌ స్పీడ్ పెంచిన యంగ్ రెబ‌ల్ స్టార్‌ ఏప్రిల్‌27 న సాహో టీజ‌ర్‌


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా మొదలైన ఈ సినిమా టీజర్  ఏప్రిల్ 27 సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారట.  


బాహుబలి తర్వాత అదే రేంజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆలోచనలో ఉన్న ప్రభాస్ సుజిత్ సినిమా కరెక్ట్ అని ఫిక్స్ చేసుకున్నాడు. పోలీసాఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్న ఈ సినిమాలో ఫైట్స్ కేసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారట. మరి టీజర్ తోనే సినిమా ఎలా ఉండబోతుందని చూపించబోతున్నారట. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈ టీజర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అంతేకాదు బాహుబలి-2 ప్రదర్శించబడుతున్న అన్ని థియేటర్స్ లో ఈ టీజర్ వస్తుందని టాక్. అయితే ఈ విషయంపై దర్శక నిర్మాతలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. యువి క్రియేషన్స్ పతాకంలో దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. తెలుగు తమిళ హింది భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారట.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా