దీనిపై పోలీసులు స్పందించారు. అటు నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డని, ఇటు అపార్ట్ మెంట్ వాసులను పిలిచి పోలీసు కౌన్సిలింగ్ ఇచ్చారు.
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక భర్తకి, అపార్ట్మెంట్ వాసుల మధ్య అర్థరాత్రి జరిగిన గొడవలో ఇరు వర్గాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై పోలీసులు స్పందించారు. అటు నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డని, ఇటు అపార్ట్ మెంట్ వాసులను పిలిచి పోలీసు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరి మధ్య పోలీసులు రాజీ కుదిర్చారు. జరిగిన దానిపై ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి దీన్ని సమస్య పరిష్కారమయ్యింది. ఈ నేపథ్యంలో పరస్పారం చేసుకున్న ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఏమైందో ఏమోగానీ అర్థరాత్రి అర్థరాత్రి నిహారిక-చైతన్య నివసిస్తున్న అపార్ట్ మెంట్లో గొడవ జరిగింది. చైతన్య నైట్ టైమ్లో న్యూసెన్స్ చేస్తున్నాడంటూ అపార్ట్ మెంట్ వాసులు ఆయనతో గొడవకి దిగారు. దీంతో నైట్ అపార్ట్ మెంట్లో పెద్ద రచ్చ అయ్యింది. ఓ వైపు చైతన్యకి, మరోవైపు అపార్ట్ మెంట్ వాసులకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో అపార్టుమెంటు వాసులంతా చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే అపార్ట్ మెంట్ వాసులపై నిహారిక భర్త సైతం ఫిర్యాదు చేశారు. పోలీసులు పరస్పర ఫిర్యాదులను స్వీకరించి ఇద్దరిని పిలిపించి రాజీ కుదిర్చారని సమాచారం.
మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి అయిన నిహారికకి.. గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్రావు కుమారుడు చైతన్యతో గతేడాది డిసెంబర్లో వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరి ఫోటో షూట్లు, ఇద్దరి మధ్య ప్రేమానుబంధాన్ని పంచుకునే ప్రతి సన్నివేశం, సంఘటనలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.